Nara Lokesh: టీడీపీలో కార్యకర్తలే అధినేత… పార్టీనే అందరికీ అధినాయకత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: టీడీపీ అనేది ఒక వ్యక్తికి పరిమితం కాని పార్టీ అని, కార్యకర్తలే నిజమైన అధినేతలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ కమిటీలకు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, పార్టీనే అందరికీ అధినాయకత్వం అని పేర్కొన్నారు. పార్టీలో యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగేలా సంస్కరణలు చేపట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యంగా అన్నదాతకు అండగా నిలుస్తోందని చెప్పారు. రైతుకు కష్టం వస్తే ముందుండి పోరాడాల్సిందేనని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Read Also: Paris Hindu Temple: ఫ్రాన్స్లో మొట్టమొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన..
Also Read
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. మహిళలకు 33 శాతం పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, పార్టీలో మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు లోకేష్. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారికే కమిటీల్లో బాధ్యతలు అప్పగించామని, పార్లమెంటరీ కమిటీల్లో 83 శాతం మంది కొత్తవారికి తొలిసారి అవకాశం కల్పించామని లోకేష్ తెలిపారు. అంజిరెడ్డి, మంజులా, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలు అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. “మడమ తిప్పటం, మాట మార్చటం తెలుగుదేశం రక్తంలోనే లేదు” అని పేర్కొన్న లోకేష్, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేయడం, కార్యకర్తలకు సాయం చేయడం కోసం నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. సేనాధిపతి చంద్రబాబు నేతృత్వంలో మనమంతా ఆయన సైనికులమని పేర్కొన్న లోకేష్, చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!