వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వ్యక్తి ఈ రోజు మృతిచెందారు.. వైఎస్ వివేకా కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఈ రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.. రంగన్న వయస్సు 85 సంవత్సరాలు.. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రంగన్న తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. అయితే, కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రంగన్న మృతిచెందారు
పోసాని కేసులో కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు ఆదోని పోలీసులు.. మరోవైపు, పోసాని కృష్ణ మురళికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.. ఈ రెండు పిటిషన్లపై రేపు కర్నూలు జేఎఫ్సీఎం కోర్టులో విచారణ జరగనుంది.. ఇక, పోసాని మురళి కృష్ణకు 14 రోజులు రిమాండ్ విధించింది కర్నూలు కోర్టు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ప్రభుత్వంలో 650 కోట్ల రూపాయలతో సలహాదారులు నియమించుకున్నారు.. అంత మంది సలహాదారులను నియమించుకుని కనీసం జల్జీవన్ మిషన్ లో రాష్ట్రానికి వచ్చిన ఫండ్ ఉపయోగించుకోలేకపోయారు అంటూ దుయ్యబట్టారు..
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన-టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మేథావి వర్గం ఆలోచనలను పసిగట్టకుండా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాయనే చర్చ విస్త్రతంగా జరుగుతోంది. వైఫల్యం ఎక్కడ జరిగింది ? బాధ్యులు ఎవరనే పోస్ట్ మార్టం మొదలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజవర్గంలో జరక్కూడనిదేదో జరిగిపోతోందని సొంత పార్టీ జనసేన కేడరే గుర్రుగా ఉందట, గుసగుసలాడుకుంటోందట. నాడు నెత్తిన పెట్టుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యే దేవ ప్రసాదరావుకు ఇప్పుడు అంత కానివాళ్ళం అయిపోయామా అంటూ... కార్యకర్తలు నిష్టూరాలాడుతున్నట్టు సమాచారం.
మన్యం జిల్లా... పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చందర్. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు. మామూలుగా అయితే... ఉప్పు నిప్పులా ఉండాల్సిన రాజకీయం ఇద్దరిదీ. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అలాగే ఉందట కూడా. కానీ... ఎలక్షన్స్ తర్వాత సీన్ కంప్లీట్గా మారిపోయిందట. మనం మనం పార్వతీపురం అనుకుంటూ..
ప్రొఫెసర్ కోదండరామ్..... పిల్లలకు రాజకీయ పాఠాలు చెప్పే సారు. క్లాస్రూమ్ లెసన్స్లో తనకు తిరుగులేదని అనింపించుకున్న ఈ మాస్టారు..... పొలిటికల్ ప్రాక్టికల్స్లో మాత్రం బాగా వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుదామని రంగంలోకి దిగినా సరైన వ్యూహరచన లేక బోల్తా పడుతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.
తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి... అయితే, గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తామని చెప్పామంటూ కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.
తెలంగాణలో బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మామూలుగా అయితే... ఇది రొటిన్ వ్యవహారంలాగే అనిపించేదిగానీ... పార్టీ ఫిరాయింపుల్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకోవడంతో.... పొలిటికల్ ఫైర్ మొదలైంది. ఆ పది మంది మీద ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ ఓ వైపు సుప్రీం కోర్ట్లో పెద్ద యుద్ధమే చేస్తోంది గులాబీ పార్టీ.
2024 ఎన్నికలు ఒక చరిత్ర.. 9 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరో చరిత్రగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు నాయుడు.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో కూడా రెండు టీచర్ సంఘాలకు ఓటు వేయమని చెప్పాం.. పని చేసే వారికే గెలుపు వరిస్తుంది. జనసేన తరపున పవన్ కల్యాణ్కు అభినందనలు.. బీజేపీ, జనసేన కార్యకర్తలు క్రమశిక్షణతో పని చేశారని పేర్కొన్నారు..