Khiladi Lady : బంధువే కదా ఆశ్రయమిస్తే నగలు, డబ్బుతో పరార్
- ఆమె పేరు చెరకుపల్లి లక్ష్మీ స్వరాజ్
- ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలపై కన్నేసింది
- నిమ్మరసంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది
- మణికంఠశర్మ, హేమబిందు స్పృహ కోల్పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంధువే కదా ఆశ్రయమిస్తే రాబంధువుగా మారింది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలాడీ లేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్ గుర్తు పట్టని ఆ దంపతులు.. సొమ్ము పోయిన తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సీన్ కట్ చేస్తే జస్ట్ 24 గంటల్లోనే కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఇదే జరిగింది. బీహెచ్ఈఎల్ కాలనీ పరిధిలోని ఆదర్శనగర్లో పురోహితులైన యర్రవల్లి మణికంఠశర్మ, హేమబిందు దంపతుల ఇంటికి వచ్చింది ఓ మహిళ. ఆమె పేరు చెరకుపల్లి లక్ష్మీ స్వరాజ్. తాను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్నానని ప్రాధేయపడింది. బంధుత్వంపై ఉన్న గౌరవం.. ఆమె పరిస్థితిపై ఉన్న జాలితో ఆ దంపతులు ఆమెకు తమ ఇంట్లోనే ఉండేందుకు ఆశ్రయం ఇచ్చారు…
కొన్ని రోజులు.. ఆ దంపతుల నమ్మకాన్ని గెలుచుకుంది లక్ష్మీస్వరాజ్. వారి ఇంట్లో ఒక మనిషిగా ఉన్నట్లుగానే మెదిలింది. కానీ ఆ తర్వాత ఆమె తన కన్నింగ్ ఆలోచనలకు తెరతీసింది. ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలపై కన్నేసింది. మార్చి 13న వాటిని కొట్టేసేందుకు ప్లాన్ చేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆ దంపతులకు నిమ్మరసంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. ఆ పానీయం తాగిన కొద్దిసేపటికే మణికంఠశర్మ, హేమబిందు ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. లక్ష్మీస్వరాజ్ తన ముఠా సభ్యులైన పర్వతం కిరణ్కుమార్, కోనపర్తి యశ్వంత్, భారడి దీపక్, శివను ఆ ఇంటికి రప్పించింది…
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
ముఠా సభ్యులతో కలిసి ఇంట్లోని అల్మారాలను బద్దలుకొట్టి దాదాపు 30 తులాల బంగారం, 2.3 కిలోల వెండి, 3 ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. బాధితులు స్పృహలోకి వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం.. లక్ష్మీస్వరాజ్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీ, నిందితులు వాడిన వాహనాల నంబర్లు, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితురాలు లక్ష్మీస్వరాజ్తో పాటు మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దోచుకెళ్లిన పూర్తి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు… బంధువులైనా, తెలిసిన వారైనా సరే ఇంటికి వచ్చినప్పుడు పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు, బంగారం ఎక్కడ దాస్తారో వంటి వ్యక్తిగత విషయాలను ఎవరికీ వెల్లడించవద్దని కోరారు. ఆపదలో ఉన్నారని నమ్మి అపరిచితులకు లేదా దూరపు బంధువులకు ఆశ్రయం ఇచ్చే ముందు వారి ప్రవర్తనను గమనించాలని హెచ్చరించారు…
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!