Khiladi Lady : బంధువే కదా ఆశ్రయమిస్తే నగలు, డబ్బుతో పరార్
- ఆమె పేరు చెరకుపల్లి లక్ష్మీ స్వరాజ్
- ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలపై కన్నేసింది
- నిమ్మరసంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది
- మణికంఠశర్మ, హేమబిందు స్పృహ కోల్పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంధువే కదా ఆశ్రయమిస్తే రాబంధువుగా మారింది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలాడీ లేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్ గుర్తు పట్టని ఆ దంపతులు.. సొమ్ము పోయిన తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సీన్ కట్ చేస్తే జస్ట్ 24 గంటల్లోనే కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఇదే జరిగింది. బీహెచ్ఈఎల్ కాలనీ పరిధిలోని ఆదర్శనగర్లో పురోహితులైన యర్రవల్లి మణికంఠశర్మ, హేమబిందు దంపతుల ఇంటికి వచ్చింది ఓ మహిళ. ఆమె పేరు చెరకుపల్లి లక్ష్మీ స్వరాజ్. తాను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్నానని ప్రాధేయపడింది. బంధుత్వంపై ఉన్న గౌరవం.. ఆమె పరిస్థితిపై ఉన్న జాలితో ఆ దంపతులు ఆమెకు తమ ఇంట్లోనే ఉండేందుకు ఆశ్రయం ఇచ్చారు…
కొన్ని రోజులు.. ఆ దంపతుల నమ్మకాన్ని గెలుచుకుంది లక్ష్మీస్వరాజ్. వారి ఇంట్లో ఒక మనిషిగా ఉన్నట్లుగానే మెదిలింది. కానీ ఆ తర్వాత ఆమె తన కన్నింగ్ ఆలోచనలకు తెరతీసింది. ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలపై కన్నేసింది. మార్చి 13న వాటిని కొట్టేసేందుకు ప్లాన్ చేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆ దంపతులకు నిమ్మరసంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. ఆ పానీయం తాగిన కొద్దిసేపటికే మణికంఠశర్మ, హేమబిందు ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. లక్ష్మీస్వరాజ్ తన ముఠా సభ్యులైన పర్వతం కిరణ్కుమార్, కోనపర్తి యశ్వంత్, భారడి దీపక్, శివను ఆ ఇంటికి రప్పించింది…
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ముఠా సభ్యులతో కలిసి ఇంట్లోని అల్మారాలను బద్దలుకొట్టి దాదాపు 30 తులాల బంగారం, 2.3 కిలోల వెండి, 3 ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. బాధితులు స్పృహలోకి వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం.. లక్ష్మీస్వరాజ్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీ, నిందితులు వాడిన వాహనాల నంబర్లు, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితురాలు లక్ష్మీస్వరాజ్తో పాటు మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దోచుకెళ్లిన పూర్తి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు… బంధువులైనా, తెలిసిన వారైనా సరే ఇంటికి వచ్చినప్పుడు పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు, బంగారం ఎక్కడ దాస్తారో వంటి వ్యక్తిగత విషయాలను ఎవరికీ వెల్లడించవద్దని కోరారు. ఆపదలో ఉన్నారని నమ్మి అపరిచితులకు లేదా దూరపు బంధువులకు ఆశ్రయం ఇచ్చే ముందు వారి ప్రవర్తనను గమనించాలని హెచ్చరించారు…
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!