గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. పోటాపోటీ క్యాంప్ లు నడుపుతున్న టీడీపీ, వైసీపీలు శిబిరాలను విదేశాలకు తరలించాయి. దీంతో మేయర్ హరి వెంకట కుమారి అవిశ్వాస పరీక్ష చుట్టూ ఉత్కంఠ రెట్టింపైంది. గ్రేటర్ మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ నో కాన్ఫిడెన్స్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్కు మరో గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రూ.1,332 కోట్లతో తిరుపతి – పాకాల – కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది.. తిరుపతి - పాకాల - కాట్పాడిల మధ్య మొత్తం 104 కిలో మీటర్ల మార్గంలో రూ.1,332 కోట్లతో డబ్లింగ్ పనులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది
రాష్ట్రంలో సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయ మార్గాలు పెంచుకోవలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మాజీ సీఎం గనుక వైఎస్ జగన్కు భద్రత ఇచ్చాం.. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే.. వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే ఆయనకు వర్తిస్తుందన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.. కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు..
గతంలో మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 32 వేల కోట్ల అప్పులు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని సావెరి సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.. ఈ సమావేంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2014-19 మధ్య ప్రజలకు ఇబ్బంది లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి అమలు చేశాం.. కానీ, 2019- 24 మధ్య కాలంలో ఐదేళ్లు ఎక్సైజ్…
పార్టీలో లోకేష్కి కీలక బాధ్యతలు ఇవ్వాలంటున్నారు.. టీడీపీకి లోకేష్ నాయకత్వం అవసరం అన్నారు వర్మ.. పార్టీకి 2047 ప్రణాళిక కావాలని అభిప్రాయపడ్డారు.. అయితే, పార్టీ రథసారథిగా నారా లోకేష్ ను నియమించేలా.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు. లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు వర్మ..
వల్లభనేని వంశీ మోహన్కు మరో సారి షాక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్ను మరోసారి పొడిగించింది కోర్టు.. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం..
వైఎస్ జగన్ ను లేకుండా చేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత జగన్.. కానీ, జగన్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. గతంలో రెండుసార్లు జగన్ పై దాడులు జరిగాయి.. పాదయాత్ర సమయంలో అనేక అడ్డంకులు సృష్టించారు.. జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్కు పర్యటన సమయంలో కనీస భద్రత కల్పించకపోవటం దారుణం అన్నారు..