Sugavasi Subramanyam: కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలకు సుగవాసి ఛాలెంజ్
- ఈ మధ్యే టీడీపీకి గుడ్ బై.. వైసీపీలో చేరిన సీనియర్ నేత..
- తొలిసారి కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు..
- కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేస్తారా..
- 164 మంది ఎమ్మెల్యేలకు సుగవాసి సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugavasi Subramanyam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అవినీతి పెచ్చు మీరి పోయిందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.. అవినీతి జరగలేదని కూటమి ఎమ్మెల్యేలు కాణిపాకం లో ప్రమాణానికి సిద్ధమ అంటూ ఆయన సవాల్ విసిరారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా ఆయన టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు… రాయచోటిలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో.. తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు… రాష్ట్రంలో ధన ఉన్మాదం రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు… గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అవినీతి జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.. ఈ అంశాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో తాను టీడీపీకి రాజీనామా చేసినట్లు వివరించారు.
Read Also: Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ఎవరైనా వెళ్లే ఛాన్స్.. ఇలా చేయండి చాలు..
Also Read
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
నాలుగు దశాబ్దాల పాటు టీడీపీలో కొనసాగిన ఆ కుటుంబం.. ఇప్పుడు వైసీపీలో కీలకంగా మారిందని రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం అంటున్నారు.. టీడీపీలో జరుగుతున్న అవినీతి అక్రమలను చూసి సహించలేక, తాను టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరానని స్పష్టం చేశారు.. టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే.. ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు… వైసీపీలో చేరిన తరువాత మొదటిసారిగా జరిగిన వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీపై విరుచుకుపడ్డారు.. టీడీపీలో కొనసాగుతున్న సమయంలో కూడా ఆయన పలువురు టిడిపి నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు… ఇసుక మట్టి మాఫియాతో టిడిపి నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు… సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపణలతో అటు రాజంపేట, ఇటు రాయచోటి నియోజకవర్గా లలో టిడిపి నేతలు మట్టి, ఇసుక జోలికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట.. అయితే టిడిపికి రాజీనామా చేసిన తర్వాత కూడా మళ్లీ ఆయన టీడీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు..
తాజావార్తలు
-
Imanvi Ismail: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు?.. ‘ఫౌజీ’ వెనుక ఇదే కారణమా?
-
YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
-
Mixed Talk Movies : మిక్స్డ్ టాక్తో వందల కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చిన సినిమాలు
-
Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్లో త్వరలో లాంచ్?
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!