Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About No Tdp In Charges In Vijayawada West Avanigadda And Kaikaluru

Off The Record: ఆ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ పూర్తిగా వదిలేసిందా..?

Published Date :June 28, 2025 , 10:00 pm
By Sudhakar Ravula
  • విజయవాడ వెస్ట్‌, అవనిగడ్డ, కైకలూరులో నో టీడీపీ ఇన్ఛార్జ్‌..
  • మూడు నియోజకవర్గాల్లో మిత్రపక్షాల గెలుపు..
  • పవర్‌లో ఉన్నా ఇన్ఛార్జ్‌లను ఎందుకు పెట్టడంలేదని అసహనం..
  • విజయవాడ వెస్ట్‌లో టీడీపీకి గట్టి పట్టు..
  • ఎంపీ కేశినేని చిన్నికి నియోజకవర్గ బాధ్యతలు..
  • ప్రతి పనికి ఎంపీ ఆఫీస్‌కు వెళ్ళడం ఇబ్బంది అన్న టాక్‌..
  • టీడీపీ బలహీనతను వాడుకుని బలపడే ప్లాన్‌లో బీజేపీ?..
  • పదవులు రాక, పనులు చేయించుకోలేక కేడర్‌ డీలా..
Off The Record: ఆ అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ పూర్తిగా వదిలేసిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం శీతకన్ను వేసిందంటూ తెగ ఫీలవుతున్నారట తమ్ముళ్లు. విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, కైకలూరు సెగ్మెంట్స్‌లో ఇప్పటి వరకు పార్టీ ఇన్ఛార్జ్‌లు లేరు. ఈ మూడింటిలో రెండు చోట్ల బీజేపీ, అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉంటే అందులో 13 చోట్ల టీడీపీ గెలవగా… మిగతా మూడింటిని మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేయటానికి కొందరు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేసినా… మిత్రపక్షాలకు కేటాయించడంతో కామ్‌ అయిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో మూడు నియోజకవర్గాల్లో కనీసం ఇన్ఛార్జ్‌లను నియమించుకోలేకపోవడం ఏంటంటూ… తీవ్ర అసహనంగా ఉన్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. దీనివల్ల లోకల్‌గా అటు లీడర్స్, ఇటు క్యాడర్ రకరకాల ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. గెలిచిన పార్టీ నాయకులతో.. పలు అంశాల్లో విబేధాలు పెరుగుతున్నాయట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలని చాలామంది ప్రయత్నించారు. కొందరైతే పోరాటాలు కూడా చేశారు. అయినాసరే… చివరికి బీజేపీకి కేటాయించటంతో ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

Read Also: Off The Record: కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్.. బీఆర్ఎస్‌ అధినేత స్పందిస్తారా..?

Also Read

  • SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
  • Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
  • Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
  • KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా…. ఇక్కడ టీడీపీకి పట్టు ఎక్కువ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా టీడీపీ ఎంపీ అభ్యర్ధికి ఈ సెగ్మెంట్‌లో మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఇన్చార్జి లేకపోయినా ఎంపీ కేశినేని చిన్నికి విజయవాడ వెస్ట్‌ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో… ఏ పని కావాలన్నా క్యాడర్ అంతా కూడా ఎంపీ ఆఫీస్‌ దగ్గరకు వెళ్ళాల్సిన పరిస్థితి. మరోవైపు ఇన్చార్జి పదవి కోసం పార్టీలో సీనియర్స్, జూనియర్స్ మధ్య పోటీ పెరిగి అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. ఇదే సమయంలో టీడీపీ గ్రూపు గొడవను బీజేపీ అవకాశంగా తీసుకుని బలపడే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతల్లో ఒకరిద్దరిని మాత్రమే బీజేపీ స్థానిక నాయకత్వం ప్రోత్సహించటంతో మిగతా వారు లోలోపల ఉడికి పోతున్నట్టు సమాచారం. ఇన్చార్జి లేకపోవటంతో డివిజన్ కమిటీలు కూడా వేయలేదు. ఒకవేళ వేద్దామన్నా…లీడర్ల గొడవతో ముందడుగు పడటంలేదట. దీంతో పార్టీ పదవులు లేక, నామినేటెడ్ పదవులు రాక, పనులు చేయించుకోవటానికి ఇన్చార్జి లేక… విజయవాడ వెస్ట్‌ టీడీపీ కేడర్‌ డీలా పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన తరపున మండలి బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ముందు వరకు టీడీపీ అవనిగడ్డ ఇన్చార్జిగా ఉన్నారు బుద్ధప్రసాద్‌. ఎన్నికల సమయంలో పార్టీ మారి జనసేన నుంచి గెలిచారాయన. ఆ తర్వాత.. కొందరు టీడీపీ కార్యకర్తలు జనసేనలోకి వెళ్ళారు. కానీ… ఎక్కువ మంది మాత్రం పార్టీ మారలేదు. గతంలో టీడీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నాసరే… జనసేన నుంచి గెలిచాక మండలి తమను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ… రగిలిపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో ఇదే విషయాన్ని ఇన్చార్జి మంత్రి ఎదురుగానే స్పష్టం చేయటం ద్వారా కూటమిలో ఉన్న విబేధాలు బయట పడ్డాయంటున్నారు. లోకల్‌గా ఇసుక, మట్టి తవ్వకాలకు సంబంధించి పోస్టులు పెట్టిన తెలుగు యువత కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నారని ఈ సమావేశంలో చెప్పడంతో వ్యవహారం రచ్చకెక్కిందట.

Read Also: Raja Singh: “నేనూ అధ్యక్ష పదవి అడుగుతా”.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

అలాగే… టీడీపీ నేతలకు స్థానిక అధికారులు ఏ పనులు చేయటంలేదని, అధికారంలోకి వచ్చినా కూడా ఈ గతేంటని తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జ్‌ లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతో బుద్ధప్రసాద్‌ వైఖరి మీద నియోజకవర్గాల వారీగా అంతర్గత సమావేశాలు పెట్టుకుని మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు కైకలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ ఇన్చార్జి పదవి లేకపోవటంతో తీవ్ర నిరాశగా ఉందట కేడర్‌. 2014 -2019 సమయంలో కూడా ఇక్కడ నుంచి బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఇన్చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఉన్నారు. ఆ ఐదేళ్ళు క్యాడర్ కు ఏ అవసరం వచ్చినా… ఆయన ముందుండేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. జయమంగళ వెంకటరమణ టీడీపీ నుంచి వైసీపీలోకి తాజాగా వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళారు. దీంతో ఇక్కడ ఇన్చార్జి పదవి కోసం క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆధిష్టానం ఎవర్నీ నియమించకపోవడంతో… నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు కూడా పెద్దగా జరగడం లేదంటున్నారు. ఇప్పటికైనా…. ఈ మూడు చోట్లా టీడీపీ ఇన్ఛార్జ్‌లను నియమించకుంటే… కూటమి స్థానిక నేతల మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయి… అంతిమంగా మూడు పార్టీల అధిష్టానాలకే సవాల్‌గా మారవచ్చని అంటున్నారు విశ్లేషకులు. కనీసం త్రీ మెన్ కమిటీలను వేసి అయినా… కేడర్‌లో ఉన్న అసంతృప్తిని కొంతవరకు తగ్గించాలని కోరుతున్నారు తమ్ముళ్ళు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Avanigadda
  • cm chandrababu
  • kaikaluru
  • off the record

తాజావార్తలు

  • Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!

  • SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..

  • Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!

  • Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..

  • Gutti Vankaya Recipe : కుక్కర్‌లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions