Union Minister Gajendra Singh Shekhawat: ప్రధాని నరేంద్ర మోడీ విజన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్లానింగ్తో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.. ఇక, ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన రోజును సంవిధాన్ హత్యా దివస్ గా జరుపుకున్నాం.. వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం కోల్పోయిన రోజుగా భావించామన్న ఆయన.. ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమంగా ఎమర్జెన్సీని గుర్తించారు.. 1977లో […]
25 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో స్పేస్ పాలసీ రూపొందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దీని ద్వారా ప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం.. 25 నుంచి 45 శాతం వరకు పెట్టుబడి రాయితీలు కూడా కల్పించనుంది.. విద్యార్ధులను భాగస్వాములు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఆకర్షణీయంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ఉండాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు..
అమరావతిలో రాష్ట్ర సచివాలయం, హెచ్వోడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసింది ప్రభుత్వం.. టెండర్లలో L1 గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఎపీ సెక్రటేరియట్, హెచ్వోడీ కార్యాలయాలు (GAD టవర్) నిర్మాణ పనులను ఎన్ సీసీ లిమిటెడ్.. రూ. 882.47 కోట్లకు దక్కించుకుంది.. సచివాలయంలోని జీఏడీ టవర్ను నిర్మించనుంది ఎన్ సీసీ లిమిటెడ్ సంస్థ.. ఇక, సచివాలయంలోని 1, 2, హెచ్వోడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ లిమిటెడ్ దక్కించుకుంది.. రూ.1,487.11 కోట్ల వ్యయంతో…
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే గ్రామం ఉంది.. ఆ గ్రామంలో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి పవన్ కల్యాణ్ ట్రస్టు ద్వారా 50 లక్షల రూపాయలు ఇచ్చారు.. ఎన్నికలకు ముందు నియోజకవర్గ పర్యటనలో పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని సందర్శించినప్పుడు తన ఇంటిపేరుతో ఊరు ఉందన్న విషయం తనకు తెలియదని.. తాము అధికారంలోకి వస్తే ఈ కొణిదేల గ్రామాన్ని దత్తాతకు తీసుకుంటానని హామీ ఇచ్చారు..
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో రూలింగ్లో ఉన్న బీజేపీకి మధ్య ఢిల్లీ నుంచి గల్లీ దాకా... వాట్సాప్ నుంచి ఇన్స్టా వరకు వార్... నువ్వా నేనా అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. రెండూ జాతీయ పార్టీలు, ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది కాబట్టి... పొలిటికల్ విమర్శలు, సవాళ్లు కామన్. కానీ కరీంనగర్ పొలిటికల్ సినారియో మాత్రం..
తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటోంది. ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది.... టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటోంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి. ఈ క్రమంలో.... రెండు సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పని చేసిన అబ్రహం... ఈసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని,
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరు చెబితేనే నియోజకవర్గంలో చాలామంది హడలిపోతున్నారట. అలాగని ఆయనేమన్నా... అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారా.. అవినీతిపరుల భరతం పడుతున్నారా అంటే.... అబ్బే.. అలాంటిదేం లేదు. అసలు ఎమ్మెల్యే అనుచరుల తీరే తేడాగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయట లోకల్గా. టీడీపీ, బీజేపీతో పొత్తు ఉన్నా... అది రాజకీయం వరకేగానీ... మిగతా వ్యవహారాల్లో మన రూటే సపరేటు అంటున్నారట ఈ జనసేన శాసనసభ్యుడి అనుచరులు.
రెడ్ బుక్.... ఏపీ పాలిటిక్స్లో ఇదో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు, సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంటుంది. మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెడ్బుక్ ఓపెన్ చేస్తే... ఇప్పుడు టీడీపీ నాయకులు కొందరు లోకల్ బుక్స్ని ఓపెన్ చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా... లోకేష్ తన రెడ్బుక్ని క్లోజ్ చేసినా... నేను మాత్రం సంగతి తేలేదాకా మూసే ప్రసక్తే లేదని అంటున్నారట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. సుపరిపాలనకు సంవత్సరం పేరిట వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇదే... ఫస్ట్ ఇయర్లో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎవరి ప్లస్లు ఏంటి? ఎవరి మైనస్లు ఏంటి? ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎలాంటి లావాదేవీలు చేస్తున్నారు, ఇరుక్కుంటున్నారంటూ.... డీటెయిల్డ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో కీలక దశ ప్రారంభమైంది. 100శాతం ఉత్పత్తి లక్ష్యంగా మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ పునఃరుద్ధరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మరోవైపు, 11వేల కోట్ల ఆర్ధిక సహాయం కేంద్రం ప్రకటించిన తర్వాత RINLలో కీలక మార్పులు సంభవించాయి. సంస్కరణలు అమలు చేస్తున్న యాజమాన్యం తాజాగా రెండు కీలక విభాగాలను ప్రయివేటీకరించేందుకు నిర్ణయించింది.