MLC Nagababu Slams YSRCP: హిందూ ద్రోహి వైసీపీ.. నాగబాబు సంచలన వీడియో..
- వైసీపీపై ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు..
- వైసీపీ హిందూ ద్రోహి.. అంటూ సంచలన వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Nagababu Slams YSRCP: వైసీపీపై ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ హిందూ ద్రోహి.. అంటూ సంచలన వీడియో విడుదల చేసిన నాగబాబు, వైసీపీ హయాంలో జరిగిన అంతర్వేది రథం దగ్ధం ఘటన, రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటన, తిరుమల డిక్లరేషన్ అంశాలపై మండిపడ్డారు. వైసీపీ నాయకులకు హిందువులపై కుళ్లు కుతంత్రాలు తప్ప మరొకటి లేదని విమర్శించారు. తాను గర్వంగా సనాతన హిందువునని పేర్కొన్న నాగబాబు.. ఇతర మతాలను కించపరచకుండా ధర్మం కోసం నిలబడుతున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా తొలి రోజే అసెంబ్లీలో అర్చకుల తక్కువ జీతాల సమస్యపై మాట్లాడానని గుర్తు చేశారు. వైసీపీ నాయకులకు మసిపూసి మాయ చేయడం అలవాటేనని, అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
Read Also: Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!
Also Read
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
వైసీపీ నేతలకు ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఉన్న ఆసక్తి, హిందూ దేవాలయాలపై లేదని మండిపడ్డారు నాగబాబు.. రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికిన ఘటనను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. సినిమా రివ్యూలపై చూపించే శ్రద్ధ, భగవంతుడిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రామ మందిర ప్రారంభోత్సవం సమయంలో ఒక్క ట్వీట్ కూడా చేయలేదని గుర్తు చేశారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి, సామాన్య భక్తులను వెంకటేశ్వరస్వామికి దూరం చేశారని ఆరోపించారు. ఏ మాఫియాను కాపాడడానికి వైఎస్ జగన్ ఇదంతా చేశావు? అంటూ ప్రశ్నించారు. స్వామివారి దర్శనాలను కూరగాయల బేరంలా మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డిని తీవ్రంగా విమర్శించారు. హిందువులను వైసీపీ చులకనగా చూస్తుందా? అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ అడిగితే అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. అబ్దుల్ కలాం కంటే నువ్వు గొప్పవాడివా జగన్? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల కొండతో పాటు ఇతర కొండలను గుండు కొట్టాలని చూసింది నువ్వే కాదా జగన్? అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హిందూ ద్రోహి వైసీపీ #NoGheeInTTDLaddu@JanaSenaParty pic.twitter.com/m6qMO3q60v
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 4, 2026
తాజావార్తలు
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
-
Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
-
Vijay-Congress: ముందు మంచి ముఖ్యమంత్రి అవ్వండి.. విజయ్కు కాంగ్రెస్ సూచన
-
Lord Ganesha: 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి.. రూ.703 కోట్ల బీమా.. మహా గణపతి దివ్య దర్శనం ఇలా..
-
White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!