Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ వెనుక హిడన్ ఎజెండా.. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ చర్చకు రెడీ
- రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారు..
- రాయలసీమకు ఎన్టీఆర్ తప్ప ఎవరూ ఏమీ చేయలేదు..
- బడ్జెట్ తక్కువ ఉన్న రోజుల్లో రాయలసీమలో ప్రాజెక్టులు కట్టారు..
- కాంట్రాక్టర్ల కడుపు నింపడానికి రాయాలసీమ లిఫ్ట్..
- కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ చర్చకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజల ముందు బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారని, అయితే వాస్తవానికి రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ గణనీయంగా ఏమీ చేయలేదని బైరెడ్డి విమర్శించారు. బడ్జెట్ పరిమితులు ఉన్న రోజుల్లోనే రాయలసీమలో ఎన్నో కీలక ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు.
Read Also: Melinda Gates: ఎప్స్టీన్ ఫైల్ వల్లే బిల్గేట్స్తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
Also Read
- CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu: జొన్నగిరి ఇక ‘స్వర్ణగిరి’.. స్వర్ణాంధ్రకు నాంది పలికిన గోల్డ్ ప్రాజెక్ట్
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
వైసీపీ నేతలకు ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని, కానీ తిట్లు మాట్లాడడంలో మాత్రం వారు నైపుణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు బైరెడ్డి.. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఏ ప్రాతిపదికన ప్రారంభించారో వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లిఫ్ట్ ప్రాజెక్టుపై ఇప్పటివరకు సుమారు రూ. 850 కోట్లు ఖర్చు చేశారని, అయినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము కాలువలో కొట్టుకుపోయిందని ఆరోపించారు. రైతులకు నీరు అందించడానికన్నా కాంట్రాక్టర్ల కడుపు నింపేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టారన్నారు. రాయలసీమ లిఫ్ట్ వెనుక స్పష్టమైన హిడన్ ఎజెండా ఉందని ఆరోపించిన బైరెడ్డి, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ప్రజల సమక్షంలో చర్చ జరపాలని వైసీపీ నేతలను ఆయన సవాల్ చేశారు.
తాజావార్తలు
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
-
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
-
Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!