Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ వెనుక హిడన్ ఎజెండా.. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ చర్చకు రెడీ
- రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారు..
- రాయలసీమకు ఎన్టీఆర్ తప్ప ఎవరూ ఏమీ చేయలేదు..
- బడ్జెట్ తక్కువ ఉన్న రోజుల్లో రాయలసీమలో ప్రాజెక్టులు కట్టారు..
- కాంట్రాక్టర్ల కడుపు నింపడానికి రాయాలసీమ లిఫ్ట్..
- కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర బహిరంగ చర్చకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baireddy Rajasekhar Reddy: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశాలను ప్రజల ముందు బయటపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ వైసీపీ నేతలు గొంతెత్తుతున్నారని, అయితే వాస్తవానికి రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ గణనీయంగా ఏమీ చేయలేదని బైరెడ్డి విమర్శించారు. బడ్జెట్ పరిమితులు ఉన్న రోజుల్లోనే రాయలసీమలో ఎన్నో కీలక ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు.
Read Also: Melinda Gates: ఎప్స్టీన్ ఫైల్ వల్లే బిల్గేట్స్తో విడిపోయా.. మాజీ భార్య మిలిందా వెల్లడి
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
వైసీపీ నేతలకు ప్రాజెక్టులపై సరైన అవగాహన లేదని, కానీ తిట్లు మాట్లాడడంలో మాత్రం వారు నైపుణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు బైరెడ్డి.. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ఏ ప్రాతిపదికన ప్రారంభించారో వైసీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లిఫ్ట్ ప్రాజెక్టుపై ఇప్పటివరకు సుమారు రూ. 850 కోట్లు ఖర్చు చేశారని, అయినా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము కాలువలో కొట్టుకుపోయిందని ఆరోపించారు. రైతులకు నీరు అందించడానికన్నా కాంట్రాక్టర్ల కడుపు నింపేందుకే ఈ ప్రాజెక్టును చేపట్టారన్నారు. రాయలసీమ లిఫ్ట్ వెనుక స్పష్టమైన హిడన్ ఎజెండా ఉందని ఆరోపించిన బైరెడ్డి, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ప్రజల సమక్షంలో చర్చ జరపాలని వైసీపీ నేతలను ఆయన సవాల్ చేశారు.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..