-
అతిపెద్ద ఆర్థిక సంక్షోభం.. చైనాతో పాటు ఇతర దేశాలకు ముప్పు..!
కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. ఇప్పటికీ చాలా దేశాలు దానిని నుంచ బయటపడలేకపోతున్నాయి.. ఈ తరుణంలో చైనాకు చెందిన ఎవర్గ్రాండే దివాలా అంచుకు చేరింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. చైనా జంక్ బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా 14.4 శాతానికి పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2008లో 600 బిలియన్ డాలర్లకు దివాలా తీసిన అమెరికా సంస్థ లేమన్ బ్రదర్స్ తర్వాత.. ఇదే అతిపెద్ద సంక్షోభం […] -
ఇతర దేశాలకు మరోసారి భారత్ వ్యాక్సిన్..!
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో రెండు వ్యాక్సిన్లను తయారు చేసిన భారత్.. అగ్రదేశాలు ఎవరూ చేయని విధంగా.. ఉదారంగా ఇతర దేశాలకు సాయం చేసింది. కోట్లాది డోసులు ఉచితంగా చిన్న దేశాలకు పంపిణీ చేసి మానవత్వం చాటుకుంది. అయితే, కోవిడ్ థర్డ్వేవ్ ఎఫెక్ట్, టీకా కొరత, విపక్షాల విమర్శలతో గత కొన్ని నెలలుగా విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా నిలిపి వేసిన ఇండియా… మరోసారి కరోనా టీకాలను ప్రపంచ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది. కొవిడ్ వ్యాక్సిన్లను […] -
కొత్త సీఎంకు షాక్.. ప్రమాణం చేసిన రోజే ఇలా..!
పంజాబ్ కాంగ్రెస్ సర్కార్లో నెలకొన్ని సంక్షోభానికి తెరదింపేందుకు రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం.. కొత్త సీఎంను.. డిప్యూటీ సీఎంనులను సైతం నియమించింది.. ఇక, పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే కొత్త సీఎం చరణ్సింగ్ చన్నీకి భారీ షాకే తగిలింది.. అయితే, అది సొంత పార్టీ నుంచో.. అధిష్టానం నుంచో కాదు.. జాతీయ మహిళా కమిషన్ నుంచి.. విషయం ఏంటంటే..? చరణ్ సింగ్పై ‘మీటూ’ అరోపణలు ఉన్నాయి.. 2018లో ఆయనపై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన కొట్టిపారేశారు.. […] -
హైదరాబాద్లో భారీ వర్షం.. అత్యవసరం అయితేనే బయటకు రండి..!
హైదరాబాద్లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్మెట్, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్పల్లి, చందానగర్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల్లో […] -
జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితా రెడీ..! వీరికే ఛాన్స్..!
ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిషికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎంపీపీ ఎన్నిక 24వ తేదీన జరగనుండగా.. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు 25వ తేదీన జరగనున్నాయి.. అయితే, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… క్లీన్స్వీప్ చేసింది.. అన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.. ఇదే ఊపులో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.. వైసీపీ […] -
దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టు.. సవాల్ విసిరిన బండి..
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని ఫైర్ అయిన మంత్రి కేటీఆర్.. ఇప్పటి వరకు అన్నీ ఓపికగా భరించాం.. ఇక, నోటికిఏదివస్తే అది మాట్లాడితే.. రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.. అయితే, దమ్ముంటే నా మీద రాజద్రోహం కేసు పెట్టాలి అంటూ సవాల్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా.. తాడ్వాయిలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడతారా? […] -
వైట్ ఛాలెంజ్ స్వీకరించిన బండి సంజయ్..
తెలంగాణలో ఇప్పుడు వైట్ ఛాలెంట్ హాట్ టాపిక్గా మారిపోయింది.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి సవాల్ విసిరితే.. ఆ సవాల్ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లకు వైట్ ఛాలెంజ్ విసిరారు.. అయితే, మాజీ ఎంపీ కొండా ఛాలెంజ్ను స్వీకరిస్తూనే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బాగా బలిసినోడు, […] -
సర్కార్ను సినిమా వాళ్లు నమ్మరు.. కానీ, వాళ్లని సీఎం నమ్మాలా..?
ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి సిద్ధం అవుతోంది ప్రభుత్వం… దీనిపై ఇవాళ మంత్రి పేర్నినానితో సినీ పెద్దలు సమావేశమై.. ఆన్లైన్ విధానానికి ఓకే చెప్పారు.. అయితే, ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాన్ని సమర్థిస్తూనే.. సినీ పరిశ్రమకు చురకలు అంటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విశాఖలో మడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ విధానాలపై స్పందించారు.. ఇక, ఈ మధ్య హాట్ టాపిక్గా మారిపోయిన ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై […] -
ఏపీ కరోనా అప్డేట్..
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,679 శాంపిల్స్ పరీక్షించగా.. 839 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.. ఇక, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 8 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు. ఇదే సమయంలో 1,142 మంది పూర్థిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో […] -
7 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
దసరా మహోత్సవాలకు సిద్ధమవుతోంది ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం… దసరా మహోత్సవాల నిర్వహణపై ఇవాళ శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ అధికారులు.. అక్టోబర్ 7 నుండి 15 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్టు సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత వెల్లడించారు శ్రీశైలం ఆలయం ఈవో లవన్న.. ఈ సమయంలో వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివనున్నారు శ్రీశైల భ్రమరాంబికా దేవి.. కోవిడ్ నిబంధనలతో శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేసినట్టు లవన్న వెల్లడించారు.. గ్రామోత్సవం రద్దు దృష్ట్యా […]
తాజావార్తలు
-
బండోడి ట్యూన్కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!