TG Inter Exams: ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇంటర్ బోర్డు సెక్రటరీ కీలక సూచనలు
- ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు
- మార్చి 18వ తేదీ వరకు
- ఉదయం 9గంటల నుంచి 12 గంటలకు పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9గంటల నుంచి 12 గంటలకు పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ కృష్ణాదిత్య ఇంటర్ పరీక్షల పై కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం లో 4,89,126 విద్యార్ధులు పరీక్ష రాయనున్నారు.. రెండో సంవత్సరం లో 5,07,949 విద్యార్ధులు మంది పరీక్ష రాయనున్నారు.. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read:Adulterated Milk Deaths: కల్తీ పాల కారణంగానే మరణాలు.. కలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
ఎగ్జామ్ సెంటర్లుగా.. ప్రభుత్వ కళాశాలలు 404.. ప్రభుత్వ రంగంలో ఉండే ఎయిడెడ్ కాలేజీలు 221.. ప్రైవేట్ జూనియర్ కళాశాలు 863.. ఇతర స్కూల్స్, కాలేజీలు 7సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకున్నా అనుమతిస్తామని అన్నారు. కానీ ఆలస్యంగా రావడం వల్ల విద్యార్ధులు నష్టపోతారని హెచ్చరించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 28,500మంది ఇన్విజిలేటర్లు ఉండనున్నారు.. అన్ని శాఖల నుంచి మంచి సహకారం అందుతోందని తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు.
ప్రతి సెంటర్ కూడా నిఘా నేపథ్యంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 30వేల CC కెమెరాల నిఘా లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఇబ్బంది అయిన 5 సెంటర్లను తొలగించామని తెలిపారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మాల్ ప్రాక్టీస్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 12 గంటలకు ముందు పేపర్ తీసుకోవడానికి వీలు లేదన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
Also Read:Baby Monkey: ఇంటర్నెట్ స్టార్ బేబీ మంకీ “పంచ్” కోసం.. రూ. 2 కోట్ల ఆఫర్..
హాల్ టికెట్స్ రాని విద్యారులు కోర్టు కు వెళ్ళారు.. వారికి హాల్ టికెట్స్ విడుదల చేశామన్నారు. కాలేజీ లో ఫీజులు కట్టని విద్యార్ధులకు కూడా హాల్ టికెట్స్ అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ప్రైవేట్ కళాశాలల్లో సెంటర్స్ ఉంటాయన్నారు. మిగతా జిల్లాల్లో దాదాపుగా ప్రభుత్వ కళాశాలల్లో సెంటర్స్ ఉంటాయని తెలిపారు. మాస్ కాపీయింగ్ కి అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
-
France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
-
Maa Inti Bangaram : సమంత ‘గోల్డెన్ రన్’.. 17 లక్షలకు పైగా టికెట్లతో ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!