ఏపీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి (చంద్రబాబు) మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు అంటూ సెటైర్లు వేశారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న […]
దేశ రక్షణ కోసం ఆర్మీ సేవలు ఎంతో అవసరం.. దేశాన్ని రక్షించేందుకు బోర్డర్కు వెళ్లాలని ఉత్సాహంగా ఉన్నవారే.. ఇప్పుడు దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.. ఆర్మీలో చేరడమే మా కల.. ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం అంటున్న అభ్యర్థులు.. ఆందోళనకు దిగి విధ్వంసమే సృష్టించారు.. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, అగ్గి రాజేసింది మాత్రం అగ్నిపథ్ పథకమే అని చెప్పాలి.. సైన్యం రిక్రూట్మెంట్లో కీలక మార్పులు చేస్తూ, ‘అగ్నిపథ్’ పేరిట కొత్త పథకానికి కేంద్ర […]
అనంతపురం జిల్లాలో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి.. మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తాడిపత్రితో పాటు హైదరాబాద్లోని జేసీ సోదరుల నివాసాల్లో ఏకకాలం దాడుల నిర్వహించారు ఈడీ అధికారులు.. ఇదే సమయంలో జేసీ సోదరుల ముఖ్య అనుచరుడిగా ఉన్న కాంట్రాక్టర్ గోపాల్రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.. ఈ సోదాల నేపథ్యంలో వారి […]
* అగ్నిఫత్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నేడు అగ్నిపత్ పథకంపై ఇవాళ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష * ఇవాళ, రేపే హైదరాబాధ్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు * నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీడబ్ల్యూసీ బృందం * ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలిసెట్ ఫలితాలు విడుదల * అగ్నిపథ్పై ఆందోళనలు, విధ్వంసం నేపథ్యంలో బీహార్లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ * నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, నాగర్ కర్నూల్, […]
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ బుతువు, జ్యేష్టమాసం, కృష్ణపక్షం, శనివారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశివారు ముందడుగు వేయాలి..? ఎవరు వెనక్కి తగ్గాలి..? ఎవరు కొత్త పనులు చేపట్టాలి…? ఎవరు దూరంగా ఉంటే మంచిది..? సోమవారం రోజు వివిధ రాశులవారి దినఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=DSWIw8gLrJU
అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.. అంతే కాదు.. విధ్వంసాన్ని సృష్టించింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ విధ్వంసానికి కారణం రైల్వే పోలీసులే అంటున్నారు ఆందోళనకారులు.. పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించినా.. రైల్వే పట్టాలపైనే తిష్టవేసిన ఆందోళనకారులు.. నిరసన తెలిపేందుకు మేం రైల్వే స్టేషన్కు వచ్చాం.. ముందే ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. Read Also: Agnipath Scheme: న్యాయం కావాలని అడిగితే చంపేస్తారా? శాంతియుతంగా నిరసన […]
అగ్నిపథ్ ఆందోళనలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రణరంగంగా మార్చేశాయి.. రైళ్లను తగలబెట్టడం, రైల్వేస్టేషన్లో విధ్వంసం సృష్టించడంతో.. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు పరుగులు పెట్టారు.. అయితే, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. Read Also: Secunderabad: ఆందోళనలకు ముందుగానే ప్లాన్ చేశారా? మరోవైపు, సికింద్రాబాద్ స్టేషన్లో అన్ని రైల్వే సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.. ఇక, ఎంఎంటీఎస్ సర్వీసులనుకూడా నిలిపివేస్తున్నట్టు […]
కేంద్ర ప్రభుత్వ “అగ్నిపథ్” పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి.. ఆ నిరసనలపై ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఆర్మీ శిక్షణ ప్రక్రియ ప్రత్యేకంగా,ఆలోచనాత్మకంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.. నిర్దిష్ట ప్రమాణాలు పొందుపర్చాం.. అవి నిరంతరం పర్యవేక్షించబడతాయి మరియు పరీక్షించబడతాయని స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా భారత్కు సమర్ధవంతమైన సైన్యాన్ని అందించగలమని అభిప్రాయపడ్డారు ఆర్మీ చీఫ్.. Read Also: Agnipath Protest: అగ్గి రాజేసిన అగ్నిపథ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి భారత […]
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.. ఒక్కసారి ఎన్నికవగానే ప్రజా ప్రతినిధులు జీవితాంతం పెన్షన్ పొందుతున్నారని… ప్రాణాలు అర్పించేందుకు సైన్యంలో దిగినవారికి పెన్షన్ స్కీమ్ ఎత్తేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీహార్లో మొదట అగ్నిపథ్పై ఆందోళను ప్రారంభం కాగా.. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.. సికింద్రాబాద్లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి […]
అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తోన్న ఆందోళనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్లోకి ఆందోళనకారులు చొచ్చుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు.. మొత్తంగా అగ్నిపథ్ పై ఆందోళనకారులు ఆగ్రహంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రణరంగంగా మార్చేశారు.. రైల్వేస్టేషన్లోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు, ఏది కనిపించినా వదలకుండా ధ్వంసం చేశారు.. Read Also: Agneepath Scheme: సికింద్రాబాద్ విధ్వంసంపై స్పందించిన రేవంత్ ఇక, […]