SriLanka Crisis: కిలో క్యారెట్ రూ.490, టొమాటో రూ.150..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితిలు రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాయి.. నిత్యావసరాల నుంచి ఏ వస్తువుకు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది.. ఆ దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో అక్రమంగా అన్నింటి ధరలు పైపైకి కదులుతున్నాయి.. ఇక, కూరగాయల ధరలు కూబా లంకలో భగ్గుమంటున్నాయి.. కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది.. బంగాళాదుంపలు రెండు వందలు దాటేశాయి.. గ్రామ్ వెల్లుల్లి రూ.150 దాటేసింది శ్రీలంక ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటాలు శ్రీలంక రూపాయల్లో 150కి చేరింది.. కిలో క్యారెట్ రూ.490గా ఉండగా.. కిలో ఉల్లిని 200కు విక్రయిస్తున్నారు.. కిలో బంగాళదుంపలు రూ.220కి ఎగిసింది.. గ్రామ్ వెల్లుల్లిని శ్రీలంకలో ఏకంగా రూ.160కి విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..
Read Also: Pawan Kalyan : జనసేన పోయిన చోటే వెతుక్కుంటుందా..? మరోసారి బరిలోకి దిగుతారా..? l
Also Read
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
శ్రీలంకలో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ. 500ను దాటేసింది.. అది కూడా వారం రోజులు క్యూలో ఉంటే గాని పెట్రో దొరకని పరిస్థతి.. అప్పటి వరకు క్యూలో ఉన్నా.. దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేదు.. ఇక, బ్లాక్ లో రెండువేలు దాటేసింది లీటర్ పెట్రోలు ధర.. దీంతో, రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి.. ఇక, కూరగాయల ఉత్పత్తులను తీసుకురావడం మరియు వాటిని సురక్షితంగా ఉంచడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని కూరగాయల విక్రయదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వీటి మూలంగా కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయని చెబుతున్నారు.. మొత్తంగా శ్రీలంకలో మునుపెన్నడూ లేని విధంగా కిరాణా ధరలు పెరగడమే కాదు, దేశంలో ఇంధన కొరత కూడా ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేయబడింది. 1990 అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది.
1948లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పుడే శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ మరియు ఇంధనం వంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది… ఇదిలా ఉంటే.. అన్ని పార్టీలు కలిసి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనుందని ప్రధాని రణిల్ విక్రమసింఘే కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తను రాజీనామా చేస్తానని ప్రధానికి తెలియజేశారు. కాగా, నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేయడంతో ఆయన గుర్తు తెలియని ప్రదేశానికి పారిపోయిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత ఆందోళనకారులు విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టారు. రాజపక్సే తన నివాసం నుండి పారిపోయిన తర్వాత లక్షల రూపాయల నగదును వదిలేసి వెళ్లారని.. ఆ మొత్తాన్ని కోర్టుకు అందజేస్తామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
-
Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
-
Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!