కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరూ ఎన్టీవీ-భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహించి కోటిదీపోత్సవం గురించి చూస్తుంటారు.. గత మూడు రోజులుగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కన్నుల పండువగా కోటి దీపాల ఉత్సవం సాగుతోంది.. ఈ కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు… శివనామస్మరణతో ఎన్టీఆర్ స్టేడియం, పరిసర ప్రాంతాలు మార్మోగుతున్నాయి.. ఇవాళ కార్తీక బుధవారం సందర్భంగా ‘ప్రదోషకాల అభిషేకం’ నిర్వహించారు.. డాక్టర్ ఎన్. అనంతలక్ష్మీ గారి ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకుంది.. కాజీపేట శ్వేతార్కమూల గణపతికి కోటి గరికార్చన జరగగా.. […]
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్కు రెండేళ్లు నిండాయి.. ధరణిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై నేటితో రెండేళ్లు పూర్తవుతుంది.. 2020 నవంబర్ 2న ప్రారంభించిన ధరణి భూ పరిపాలలో ఒక కొత్త అధ్యాయంగా చెప్పాలి.. ధరణికి ముందు రాష్ట్రంలో కేవలం 141 ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగగా.. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏకంగా రాష్ట్రంలోని 574 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఇక, రిజిస్ట్రేషన్ల […]
యనమల ప్రకటనలో ఏ ఒక్కటీ వాస్తవం ఉండదు అని ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన.. ఏది అనుకూలంగా ఉంటే.. యనమల దానినే తీసుకుంటారు.. గతంలో ఎంతో ధనాన్ని మూటగట్టి.. ఈ ప్రభుత్వానికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఒకే వ్యక్తికి 88 పెళ్లిళ్లు జరిగాయంటే ఎవరైనా షాక్ అవుతారు.. కానీ, ఇది నిజం.. 14వ సంవత్సరంలోనే తొలి మ్యారేజ్ చేసుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు.. 61వ ఏట ఏకంగా 88వ పెళ్లికి సిద్ధమై ఔరా! అనిపించాడు.. ఇండోనేషియాలో జరిగిన ఈ నిత్య పెళ్లి కొడుకుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వ్యక్తికి ఇప్పటికే 87 పెళ్లిలు జరిగాయి.. అయినా మనోడి యావ చావలేదు.. చింత […]
వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధించ కూడదు.. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు.. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి.. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి అన్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ […]
మునుగోడ్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో రేపు సెలవుగా ప్రకటించింది ఎన్నికల కమిషన్.. ఉప ఎన్నిక పోలింగ్ దృష్ట్యా నవంబర్ 3న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు, ఫ్యాక్టరీలకు, దుకాణాలకు స్థానికంగా సెలవు అని పేర్కొంది ఎన్నికల కమిషన్
కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్లా దూసుకుపోతోందన్నారు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్… ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఇండియా కెం 2022 సదస్సు జరిగింది.. ఈ సదస్సుకు హాజరైన మంత్రి అమర్నాథ్.. కేంద్రం మంత్రి మన్సుఖ్ మాండవియాకు శాలువా కప్పి సత్కరించారు.. ఇక, ఆయన సదస్సులో మాట్లాడుతూ.. కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగంలో ఏపీ దూసుకుపోతుందని వెల్లడించారు.. 974 కిలోమీటర్ల సముద్ర తీరంతో దేశానికి ఏపీ ఈస్ట్రన్ గేట్వే ఆఫ్ ఇండియాగా మారిందన్న ఆయన.. […]