Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabharata Lessons: మహాభారతం…అది కేవలం పాండవులు – కౌరవుల మధ్య జరిగిన యుద్ధం కాదు. యుద్ధం ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పించిన గ్రంథం! అవును! 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామంలో లక్షల మంది యోధులు పోరాడారు. అంతటి మహాసంగ్రామంలో కూడా కొన్ని నియమాలు ఉండేవి. సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగేది. నిరాయుధుడిపై దాడి చేయడం అధర్మం. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం నిషిద్ధం. పిల్లలు, మహిళలు యుద్ధానికి దూరం. కానీ నేడు ప్రపంచం అభివృద్ధి చెందింది. ఆయుధాలు ఆధునికమయ్యాయి. కానీ యుద్ధాల నీతి? అది మాత్రం వెనక్కి వెళ్లిపోయింది. రాత్రి చీకట్లోనే క్షిపణులు ఎగురుతున్నాయి. నిద్రలో ఉన్న నగరాలు పేలుళ్లతో మేల్కొంటున్నాయి. సైనికులకంటే సామాన్యులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. కురుక్షేత్రం మనకు నేర్పిన పాఠాలను ఆధునిక ప్రపంచం మరచిపోతోందా అనే ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇలాంటి మహాభారత యుద్ధంలో తలచుకుంటే యుద్ధ ఫలితాన్నే మార్చగల నలుగురు మహా శక్తులు మాత్రం ఆయుధాలు పట్టలేదు. వాళ్లు రంగంలోకి దిగి ఉంటే మహాభారతం కథే మరోలా ఉండేదేమో! ఇంతకీ ఎవరా నలుగురు? మొదటివాడు, బలరాముడు..! అంటే శ్రీకృష్ణుడి అన్నయ్య. అపారమైన బలానికి ప్రతీక. హస్తినాపురాన్నే తన నాగలితో గంగలోకి లాగగల శక్తి ఉన్న యోధుడు. ఒకవైపు ప్రియ శిష్యుడు దుర్యోధనుడు. మరోవైపు సొంత తమ్ముడు శ్రీకృష్ణుడు. ఎవరి పక్షం తీసుకున్నా ధర్మం గాయపడుతుందని భావించిన బలరాముడు. యుద్ధానికి దూరంగా నిలిచాడు. నేటి ప్రపంచంలో కూడా యుద్ధాన్ని ఆపగల శక్తి ఉన్న దేశాలు ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో అవి మధ్యవర్తులుగా కాకుండా పక్షాలుగా మారిపోతున్నాయి. బలరాముడు శక్తి కంటే తటస్థతను ఎంచుకున్నాడు.
ఇక రెండోవాడు రుక్మి. శ్రీకృష్ణుడి బావ. పరాక్రమంలో గొప్పవాడు. కానీ అవమానం కొన్నిసార్లు ఖడ్గం కంటే లోతైన గాయాన్ని చేస్తుంది. పాత పగలు, వ్యక్తిగత కక్షలు ఎంతటి మహా యోధుడినైనా యుద్ధం నుంచి దూరం చేయగలవని రుక్మి కథ చెబుతుంది. మూడోవాడు బార్బరీకుడు. ఇతను భీముడి మనుమడు, కేవలం మూడు బాణాలతో యుద్ధరంగాన్ని ఖాళీ చేయగల మహావీరుడు. కానీ ఆయన చేసిన ఒక ప్రతిజ్ఞ ఓడిపోయే పక్షానికే తోడుగా నిలబడతానన్న మాట చివరికి యుద్ధ సమతుల్యతనే దెబ్బతీసే ప్రమాదంగా మారింది. అందుకే శ్రీకృష్ణుడు అతని శక్తిని కాదు. అతని త్యాగాన్ని ఎంచుకున్నాడు. నేడు కూడా ఇదే ప్రశ్న. శక్తి ఎవరి చేతిలో ఉంది అనేది కాదు. ఆ శక్తి ఎవరి కోసం ఉపయోగపడుతోంది అనేదే అసలు విషయం. ఇక నాలుగోవాడు విదురుడు. ఇతను ధర్మానికి మరో పేరు. అధర్మం గెలుస్తున్న సభలో నిలబడలేక, అధర్మం కోసం ఆయుధం పట్టలేక, ధర్మాన్ని వదిలి వెళ్లలేక, ఆయన తటస్థంగా నిలిచిపోయాడు. ఈ విధంగా చూస్తే మహాభారతం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. యుద్ధంలో గెలవడం గొప్ప కాదు… ధర్మాన్ని కాపాడటం గొప్ప. అప్పుడు యుద్ధాలకు నియమాలు ఉండేవి… ఇప్పుడు నియమాలకే యుద్ధం జరుగుతోంది. అప్పుడు రాజులు యుద్ధం చేసేవారు… ఇప్పుడు సామాన్యులే మూల్యం చెల్లిస్తున్నారు. కురుక్షేత్రం ముగిసిపోయి వేల ఏళ్లు కావొచ్చు… కానీ అది అడిగిన ప్రశ్న మాత్రం ఇంకా బ్రతికే ఉంది.
Also Read
- Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
- Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
- Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
తాజావార్తలు
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..