Kodali Nani: కోటంరెడ్డి వ్యవహారంలో కొడాలి సంచలన వ్యాఖ్యలు.. పకోడిగాళ్ల గురించి పట్టించుకోం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani:నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతరులందరివీ కలిపి వెయ్యి ఫోన్లు ఉంటాయి.. అవన్నీ ఎవడు వింటాడు? అని ప్రశ్నించారు.. పార్టీ మారాలనుకున్నాడు.. ఇక్కడ మంత్రి పదవి అడిగితే ఇవ్వలేదు.. చంద్రబాబు ఇస్తానన్నాడేమో వెళ్లాడు అంటూ కోటంరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. పెగాసెస్ అలాంటి వన్నీ చంద్రబాబుకు అలవాటు.. మాలాంటి వాళ్లు జగన్ వలనే ఎమ్మెల్యేలం అయ్యాం అని కోటంరెడ్డే చాలా సార్లు చెప్పారని గుర్తుచేశారు.. ఒకే కులానికి పదవులు ఇవ్వాలంటే కుదరదు.. కానీ, జగనేమో అన్ని కులాలకూ ఇవ్వాలని చూశాడు.. పిన్నెల్లి, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు కదా? నిలదీశారు.
Read Also: Cycling: సైక్లింగ్తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?
Also Read
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
- AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
నన్ను పదవి నుండి తప్పుకోమన్నాడు… తప్పుకున్నాను.. బాలినేనికి అలాగే చెప్పారు.. ఆయన అర్థం చేసుకున్నారని తెలిపారు కొడాలి.. కానీ, పదవులు కావాలని వెళ్లేవారే ఇలాంటి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. గతంలో 23 మంది పకోడిగాళ్లు టీడీపీలోకి వెళ్లారు.. వారిలో ఒకరే గెలిచారన్న ఆయన.. ఇలాంటి వాళ్లంతా వెళ్లిపోతేనే పార్టీ బాగుపడుతుందన్నారు. చంద్రబాబులా ఒకే కులానికి పదవులు అంటే కుదరదు అన్నారు. అసలు, ఫోన్ ట్యాపింగ్ ఎవరికి అవసరం? ఇంటెలిజెన్స్ డీజీకి ఏవైనా మెసేజ్ వస్తే మాకు పంపుతారు. అది సహజమే.. మా దృష్టికి వచ్చిన వాటిని కూడా అధికారులకు పంపుతుంటాం.. అందరం ప్రభుత్వంలో భాగం.. కానీ, వెళ్లేవారు వెళ్లినా జగన్ పట్టించుకోరు.. కోటంరెడ్డి లాంటి పకోడిగాళ్ల గురించి ఆలోచించాల్సిన పని లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, వైజాగ్ రాజధాని అని జగన్ సీఎం అయినప్పటి నుండి చెప్తూనే ఉన్నారు.. ఇప్పుడు సీఎం కొత్తగా చెప్పిన విషయం ఏముంది? అని ఎదురు ప్రశ్నించారు. రాజధాని విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెబితే కేంద్రం పై ఒత్తిడి తీసుకొస్తాం అన్నారు.. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు వస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాభిష్టాన్ని అంగీకరించాల్సిందేనన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.
తాజావార్తలు
-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై దూసుకెళ్లిన బొలెరో.!
-
WhatsApp New Feature: వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్డేలు మిస్ కారు..!
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
-
IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
-
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!