ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాళోజి హెల్త్ యూనివర్సిటీ.. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 11 నుండి 18వ తేదీ వరకు ఆన్లైన్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..
రివాల్వర్తో బెదిరించి ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్..
ప్రధాని మోడీ, అమిత్ షా... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి... అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అందినకాడికి ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన ఏక్నాథ్ సిండే.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. శివసేనలో రెబల్ వర్గంగా కొనసాగుతున్నారు.. తమదే అసలైన శివసేన అంటున్నారు.. అయితే, అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పుడు ఎన్నికల గుర్తులు తెరపైకి వచ్చాయి.. ఇప్పటికే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ ఆప్షన్లను ఈసీకి సమర్పించింది. మూడు గుర్తులు ఎంచుకుంది.. త్రిశూలం, ఉదయించే సూర్యుడు, […]
కొన్ని ఊహించని ఘటనలు.. తమ కళ్ల ముందు జరిగిన ప్రమాదాలు కొందరి మనస్సును పూర్తిగా మార్చేస్తాయి.. ఎన్నిసార్లు చెప్పినా.. చాలా సార్లు దొరికిపోయినా.. ఎందరో హెచ్చరించినా మనసు మార్చుకోని ఓ బైక్ రేసర్.. ఓ ఘటనను చూసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు.. మారడంటే.. తాను ఒక్కడే మారడం కాదు.. చాలా మందిని మార్చే ప్రయత్నం మొదలు పెట్టాడు.. ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చాడు.. సిగ్నల్స్ వద్ద ప్రచారం చేయడం మొదటు పెట్టాడు.. ఇంతలా మారిపోయిన ఆ బైక్ […]
ఆక్వా రైతుల ఫిర్యాదులపై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపుపై సీఎంకు రైతులు, రైతు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు.. ధరలు పతనమై నష్ట పోతున్నామన్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. అలాగే ఆక్వాఫీడ్ విషయంలోనూ వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు పెంచారని ఫిర్యాదుల్లో […]
విశాఖను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పదవికి కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన ఆయన.. ఆ లేఖను జేఏసీ ప్రతినిధులకు అందజేశారు.
ఈ ఏడాది వర్షాలు దండికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంచి వర్షాలే కురిసాయి.. ఇక, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. దీంతో.. మునుపెన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతుండగా.. ఏకంగా 45 ఏళ్ల తర్వాత ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు దుంకుతుంది.. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో క్రమంగా పెద్ద చెరువులోకి వర్షంనీరు […]