CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
CM Chandrababu: పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణాంధ్ర – స్వఛ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.. ఈ సందర్భంగా స్వచ్చ రథాలు ప్రారంభించారు సీఎం.. పారిశుద్ద్య కార్మికులకు పుష్ కాట్స్ పంపిణీ చేశారు.. ఉద్యానశాఖ స్టాల్స్ పరిశీలించారు.. గుంటూరు కారం గురించి అడిగ తెలుసుకున్నారు.. ఆ తర్వాత స్వచ్చ సర్వేక్షణ్ 2047 బ్రోచర్ ను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు..
Also Read
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
- Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. కోరిక తీర్చాలని వేధింపులు..!
ఇక, రాబోయే రోజులన్నీ వినుకొండకు మంచి రోజులే అన్నారు చంద్రబాబు.. స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్ర కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చాను. చెత్తనుంచి సంపద సృష్టించడంపట్ల సంతోషంగా ఉందన్నారు.. మండలానికి ఒక స్వచ్చ రథం ఇచ్చాం.. ప్రతి వారం మండలంలో అన్ని గ్రామాలు స్వచ్చ రథం తిరుగుతుందని తెలపారు.. పల్నాడు అనగానే పౌరుషాల గడ్డ.. కోటప్పకొండ తిరునాళ్ళు బ్రహ్మాండగా చేశారు. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలు ఎంతో ఫేమస్ అని వెల్లడించారు.
మంత్రి నారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్ర కార్యక్రమాలు నడుస్తున్నాయి. నేను సీఎం అయ్యే సమయానికి రాష్ట్రంలో 108 లక్షల టన్నుల చెత్త రాష్ట్రంలో పేరుకుపోయింది. ప్రజలకు స్వచ్చమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వఛ్చాంధ్రలో పాల్గొంటాను అని వెల్లడించారు చంద్రబాబు.. మార్చి 31 కల్లా వంద శాతం ఇంటి నుంచి చెత్త సేకరించేలా చేస్తాం. చెత్త ద్వారా మళ్లీ వస్తువుల ఉత్పత్తులు చేస్తాం. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారు. మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తాం అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశాం.. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొస్తాం అని వెల్లడించారు.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ఎమ్మెల్యేలు ప్రజలవద్దకు వెళ్లాలని చెప్పాం అన్నారు చంద్రబాబు.. దేశంలో ఏ రాష్ట్రం కూడా మన రాష్ట్రంలో ఇచ్చినంత పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. అగ్రిటెక్ అందుబాటులోకి తీసుకొచ్చాం. బిల్ గేట్స్ వచ్చి మన టెక్నాలజీ వినియోగం చూసి ఆశ్చర్యపోయారు. వారసత్వంగా వచ్చే పంటలు పండిస్తే లాభాలు రావడం లేదు. ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం పెడుతున్నాం. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాం అని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?