Ajit Pawar Plane Crash: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.. ఇప్పటికే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు.. ఈ ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. తాజాగా, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై సంచలన ఆరోపణలు అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్.. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.. అజిత్ పవార్ ప్రయాణించిన లేజర్ జెట్ విమాన యజమాని VSR సంస్థకి టీడీపీతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు రోహిత్ పవార్..
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతికి కారణమైన విమాన ప్రమాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ప్రమాద దర్యాప్తు తీరును తప్పుబడుతూ ఆయన మేనల్లుడు, ఎన్సిపి (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పారదర్శకత ఉండాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో లోతైన కుట్ర దాగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Also Read
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ఆయన లేవనెత్తిన ప్రధాన అంశాలు ఇవే:
TDPతో సంబంధాలు: అజిత్ పవార్ ప్రయాణించిన ‘లియర్జెట్ 45’ విమాన ఆపరేటర్ అయిన VSR వెంచర్స్ సంస్థకు, తెలుగుదేశం పార్టీ (TDP) అగ్రనేతలతో ఆర్థిక మరియు రాజకీయ సంబంధాలు ఉన్నాయని రోహిత్ పవార్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అదే పార్టీకి చెందిన వారు కావడంతో, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని ఆయన వాదించారు.
ప్రధానికి లేఖ: ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రోహిత్ పవార్ లేఖలు రాశారు. అయితే, విమానంలోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) సురక్షితంగా ఉండి, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) మాత్రం థర్మల్ డ్యామేజ్కు గురికావడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఒకే చోట ఉండే రెండు పరికరాల్లో ఒకటి మాత్రమే ఎలా దెబ్బతింటుందని ఆయన ప్రశ్నించారు.
విమానయాన సంస్థ నిబంధనలను బేఖాతరు చేసిందని రోహిత్ పవార్ పేర్కొన్నారు.. డీజీసీఏ (DGCA) నిబంధనలకు విరుద్ధంగా, వేరే రకమైన విమానాల్లో శిక్షణ పొందిన పైలట్లను ఈ విమానానికి కేటాయించారని ఆరోపించారు. ఇక, విమానం ఇంజిన్ కాలపరిమితి కేవలం 85 గంటలు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, దానిని తక్కువగా చూపించి విమానాన్ని నడిపారని పేర్కొన్నారు. మరోవైపు.. రూ.35 కోట్ల విలువైన విమానానికి రూ.55 కోట్లకు బీమా చేయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దర్యాప్తుపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే ప్రస్తుత కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీని వేయాలని ఆయన కోరారు. ఆ కమిటీలో రిటైర్డ్ అధికారులు మరియు మాజీ న్యాయమూర్తులు ఉండాలి. ప్రతిపక్ష ప్రతినిధులు మరియు అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు చోటు కల్పించాలి. ఒక నిర్దిష్ట కాలపరిమితిలోపు స్వతంత్ర దర్యాప్తు పూర్తి కావాలని డిమాండ్ చేశారు రోహిత్ పవార్..
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!