యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హఠాన్మరణం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. తొలుత పొలిటికల్ మర్డర్ అని భావించారు. కానీ చివరికి ఆర్ధిక లావాదేవీలే అతని ప్రాణం తీశాయని నిర్ధారణ అయింది. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకీ బొగ్గుల శ్రీనివాస్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారా? ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా తేల్చారు పోలీసులు. ఈ హత్య కేసులో […]
Top SUVs Coming to India in 2026 : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా SUVల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో పోటీ ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే, ఈ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు రెనాల్ట్, నిస్సాన్, స్కోడా , ఫోక్స్వ్యాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సరికొత్త మోడళ్లతో భారత్లోకి దండయాత్రకు సిద్ధమయ్యాయి. 2026 […]
కారు రిపేర్ వర్క్స్ మొదలయ్యాయా? మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై గులాబీ అధిష్టానం పైకి ఎంత గాంభీర్యంగా మాట్లాడుతున్నా….. లోలోపల అంతర్మథనం జరుగుతోందా? కొన్ని జిల్లాల విషయంలో పూర్తి స్థాయి పోస్ట్మార్టం మొదలైందా? ఆయా జిల్లాల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందన్న భయం కూడా పెరుగుతోందా? ఏయే ఉమ్మడి జిల్లాలను ప్రత్యేకంగా భావిస్తోంది బీఆర్ఎస్? అక్కడున్న పరిస్థితులేంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తర్వాత కొత్త లెక్కలు, సరికొత్త సమీకరణలు తెర మీదికి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ళకు పార్టీ […]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (Census 2027) ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు ఈ […]
గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు వరుణుడు ఊరటనిచ్చాడు. సోమవారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బుపట్టి చల్లని గాలులు వీచడంతో నగరంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత కురిసిన చిరు జల్లులు భాగ్యనగరాన్ని మురిపించాయి. ముఖ్యంగా అబిడ్స్, బషీర్ బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అలాగే మీర్ పేట్, బడంగ్ పేట్ […]
ఇవాళ్టి రాజకీయం కేవల వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ఆరోపణలపైనే నడుస్తోంది. రాజకీయం చేయాలంటే… ప్రత్యర్ధి పార్టీలన్నీ ఆ పార్టీ నేతలను వ్యక్తిగతంగా ఆరోపిస్తేనే రాజకయాం చేసినట్టా? విధానాలపై మాట్లాడ్డం, అభివృద్ధిపై చర్చించడం, అవసరమైతే ఖండించడం పొలిటికల్ పాలసీలు, ఆర్ధిక విధానాలు ఇవేవీ పార్టీలకు, లీడర్లకు ప్రాధాన్యతాంశాలు కావు. కేవలం అవతలి పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టించాలి. కుటుంబాల్ని వీధికెక్కించి .. వాళ్లని అల్టరి చేయాలి. తద్వారా తాము రాజకీయ మనుగడ సాధించాలన్నదే ఇవాళ్టి రాజకీయ వ్యూహం. […]
ప్రజలందర్నీ సమానంగా ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందరికీ కనీస జీవనప్రమాణాలు అందివ్వటమే లక్ష్యంగా పాలన సాగాలి. కానీ నిరుపేదలకు ఆసరా ఇవ్వటానికి ఉద్దేశించిన సంక్షేమం రూపు మార్చిన ప్రభుత్వాలు.. ఇష్టారాజ్యంగా ఉచితాలతో బరితెగిస్తున్నాయి. ఈ పోకడలే పుట్టి ముంచుతాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలపై కొంతకాలంగా కొనసాగుతున్న చర్చకు సుప్రీంకోర్టు తెరదించింది. ఉచితాలను, సంక్షేమాన్ని కలగలిపి చూడొద్దని దిశానిర్దేశం చేసింది. ఆర్థికవ్యవస్థను కుదేలు చేసే ఉచితాలను పక్కనపెట్టి.. నిరుపేదల కనీస అవసరాలు తీర్చే విధంగా […]
TG EdCET 2026 : తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ (B.Ed) కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక TG EdCET-2026 నోటిఫికేషన్ను వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన కేయూ, దరఖాస్తుల ప్రక్రియ నుంచి ఫలితాల విడుదల వరకు పూర్తి షెడ్యూల్ను ఖరారు చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీ వరకు […]
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలోనే రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిగా చేసే వరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలి రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన వికారాబాద్ లో నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో మాట్లాడారు. “కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాటం […]
అనవసరంగా ఎక్కువ భయపడ్డాం…. చాలా ఊహించేసుకున్నాం…. అందుకే అవసరమైనదానికంటే ఒకింత ఎక్కువ జాగ్రత్తపడ్డాం. కానీ… అంత సీన్ లేదని తేలిపోయింది. లైట్ తీస్కో బాసూ…. డోంట్వర్రీ. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కిల్స్లో ఏ ఇద్దరు ముఖ్యులు కలిసినా ఇలాగే మాట్లాడుకుంటున్నారట. ఇంతకీ ఇన్నాళ్ళు ఏ విషయంలో భయపడ్డారు వాళ్ళంతా? ఇప్పుడా భయం ఎందుకు పోయింది? ఎవర్ని లైట్ తీసుకోవాలనుకుంటున్నారు? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాయి. పార్టీ గుర్తుల మీద జరిగిన లోకల్ […]