భారత భూగంలోకి అక్రమంగా ప్రవేశించి ఇద్దరు చైనీయులను సశాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ) అరెస్ట్ చేసింది. బీహార్లోని సీతామర్హి జిల్లాలోని భితామోర్ బోర్డర్ అవుట్పోస్ట్ నుంచి నేపాల్లోకి ఆదివారం సాయంత్రం అక్రమంగా ప్రవేశిస్తున్న చైనా జాతీయులు యుంగ్ హై లంగ్ (34), లో లంగ్ (28)ను తమ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఎస్బీ కమాండర్ రాజన్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. వారి వద్ద ఎలాంటి అధికార పత్రాలు లేకపోవడంతో భారత్లోకి అక్రమ ప్రవేశం, ఆర్థిక మోసాలకు సంబంధించి […]
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం కొంత ఆలస్యమైన వచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంకా రాకపోవడంతో ఏరువాకకు సిద్ధం కావాల్సిన రైతన్నల్లో కొంత ఆందోళన నెలకొంది. అంతేకాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపాగ్నిలో ఉడికిపోతున్న తెలంగాణ వాసులు సైతం నైరుతు రుతుపవనాల కోసం చూస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు విస్తరించాయని వెల్లడించింది. మరో రెండ్రోజుల్లో […]
నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంకి నోటీసులు ఇవ్వడం అంటే.. దేశం నీ అవమానించడమేనని, గాంధీ కుటుంబంకి జరిగిన అవమానం కాదు.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఇందిరాగాంధీపై […]
గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల విషయంలో మోడీ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో భాగంగానే రాహుల్ ..సోనియా గాంధీకి బీజేపీ నోటీసులు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబంకి అండగా ఉంటామని, సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. నేషనల్ […]
ప్రధాన మంత్రితో పోల్చితే రాష్ట్రపతి ఎన్నిక పెద్దగా ఉత్కంఠ రేపదు. అలాంటి ఉత్కంఠ భరిత వాతారణం ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. 1969, 1997 రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే దేశం అలాంటి ఉత్కంఠను చూసింది. చాలా ఏళ్ల తరువాత ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు పోటా పోటీగా జరగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం కాస్త తక్కువగా ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం అని చెప్పవచ్చు. 2017ఎన్నికల మాదిరిగా ఈసారి అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు […]
చైనా అణ్వాయుధాలపై ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వీఫెంగే కీలక ప్రకటన చేశారు. కొత్త తరహా అణ్వాయుధాల అభివృద్ధిలో చైనా ఎంతో ప్రగతి సాధించినట్టు వీఫెంగే వెల్లడించారు. అయితే.. అణ్వాయుధాలను చైనా తన స్వీయ రక్షణ కోసమే ఉపయోగిస్తుందని వీఫెంగే వ్యాఖ్యానించారు. అంతేకానీ, ముందుగా చైనా అణ్వస్త్రాలను ప్రయోగించదని స్పష్టం చేశారు వీఫెంగే. చైనా తూర్పు భాగంలో గతేడాది 100కు పైగా అణు క్షిపణీ ప్రయోగ కేంద్రాలను నిర్మించినట్టు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా.. చైనా రక్షణ […]
యూపీఐ (UPI) అంటే యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ అప్లికేషన్లో ఏకీకృతం చేసి ఆన్లైన్లో డబ్బును బదిలీ చేయడానికి అనుమతించే కేంద్రీకృత వ్యవస్థ. అయితే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఈ యూపీఐ లావాదేవీలపైనే ఆధారపడుతుండటంతో.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా యూపీఐ మోసాలకు తెర లేపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో యూపీఐ మోసం ముప్పుగా మారింది. భారతదేశంలో యూపీఐ మోసం నుండి మిమ్మల్ని మీరు […]
దేశంలో బోరుబావిలో బాలుడు పడిన ఘటనలు మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. గతంలో బోర్లు వేసి అందులో నీళ్లు పడకపోవడంతో నిర్లక్ష్యంగా వదిపెట్టడంతో.. తెలియక వెళ్లిన చిన్నారు అందులో పడి నరకయాతన అనుభవిస్తూ మృత్యువాతపడుతున్నారు. అయితే తాజాగా.. ఛత్తీస్గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 80 అడుగుల లోతు బోరు బావిలో రాహుల్ అనే 11 ఏళ్ల బాలుడు పడిపోయాడు. రాహుల్ ను కాపాడేందుకు గుజరాత్ కు చెందిన రోబోటిక్ టీమ్ రంగంలోకి దిగింది. మాట్లాడలేని, వినలేని […]
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ నెట్ఫ్లిక్స్ తన గేమింగ్ సర్వీస్ కోసం కొత్త గేమ్లను ప్రకటించింది, అవి ‘ది క్వీన్స్ గాంబిట్,’ ‘షాడో అండ్ బోన్,’ ‘టూ హాట్ టు హ్యాండిల్’ మరియు ‘మనీ హీస్ట్’ వంటి కొన్ని ప్రసిద్ధ టీవీ షోలతో ముడిపడి ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ప్రస్తుతం 22 గేమ్లను అందిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి 50 టైటిల్స్ను కలిగి ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ వారం ‘గీక్డ్ వీక్’ ఈవెంట్లో, కంపెనీ రాబోయే గేమ్ల […]
ఆన్లైన్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల విషయానికి వస్తే భారతదేశం ప్రపంచంలోనే చాలా ముందుకు సాగినప్పటికీ, సైబర్ మోసాల కేసులు పూర్తిగా పెరిగాయి. అయితే, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఒక వ్యక్తి ఒకపైసా కారణంగా సైబర్ వల నుంచి బయటపడ్డాడు. గ్రేటర్ నోయిడాలోని డారిన్ గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తి తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 9,999.99 ఉన్నందున రూ. 10,000 ఆన్లైన్ మోసం నుండి రక్షించబడ్డాడు. ఈ సంఘటన జూన్ […]