Raghu Rama Krishnam Raju : భీమవరం వస్తూ.. ఏపీకి రాకుండానే వెనక్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని భీమవరంలో ఏర్పాటు చేసి 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నేడు ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొంటానంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ఆదివారం రాత్రి ఏపీకి పయనమయ్యారు. కానీ ఏపీకి చేరుకోకముందే ఆయన రైలు దిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఎందుకంటే.. శనివారం నాడు ఆయనకు మద్దతుగా భీమవరంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆ యువకుల తల్లిదండ్రులు ఎంపీ రఘురామరాజుకు ఫోన్ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన రఘురామ భీమవరంకు చేరుకోకుండానే రైలు దిగి తిరిగి వెళ్లిపోయినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం భాగ్యనగరానికి చేరుకున్న మోడీ.. రెండు రోజుల కార్యవర్గ సమావేశాల అనంతరం నిన్న సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?