Raghu Rama Krishnam Raju : భీమవరం వస్తూ.. ఏపీకి రాకుండానే వెనక్కి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని భీమవరంలో ఏర్పాటు చేసి 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నేడు ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొంటానంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ఆదివారం రాత్రి ఏపీకి పయనమయ్యారు. కానీ ఏపీకి చేరుకోకముందే ఆయన రైలు దిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఎందుకంటే.. శనివారం నాడు ఆయనకు మద్దతుగా భీమవరంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆ యువకుల తల్లిదండ్రులు ఎంపీ రఘురామరాజుకు ఫోన్ చేశారు.
దీంతో మనస్తాపానికి గురైన రఘురామ భీమవరంకు చేరుకోకుండానే రైలు దిగి తిరిగి వెళ్లిపోయినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇదిలా ఉంటే.. నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం భాగ్యనగరానికి చేరుకున్న మోడీ.. రెండు రోజుల కార్యవర్గ సమావేశాల అనంతరం నిన్న సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
Also Read
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?