Bandi Sanjay : గడీ పాలనను బద్దలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bandi Sanjay speech at bjp vijaya sankalpa sabha.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సహా ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇంతమందిని చూస్తుంటే నాకు సంతోషంగా వుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధ కలిగిస్తాయన్న బండి సంజయ్.. నరేంద్రమోడీ మీద తప్పుడు భాష ఉపయోగిస్తున్నారన్నారు. ఆయన్ని ఎందుకు తిట్టాలి. పేదలను ఆదుకున్నందుకు తిట్టాలా? ఆకలితో అలమటించకుండా ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా..? ఉక్రెయిన్ లో విద్యార్ధులు చిక్కకుంటే వారిని కాపాడినందుకా..? అని ఆయన ప్రశ్నించారు. మనం ఇంకా భరిద్దామా.. గడీ పాలన నుంచి తెలంగాణ తల్లి బంధ విముక్తిని చేయాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
భారతదేశం కాదు.. ఎక్కడికి వెళ్ళినా మోడీకి ఘనంగా స్వాగతిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ గొప్పతనం కేసీఆర్ కి తెలియదని, ఎంతోమంది బలిదానం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాం.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ఒక పథకం ప్రకారం మోడీని తిడుతున్నారని, మోడీని విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మోడీ తెలంగాణ గురించి ఆలోచించారు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. పేద ప్రజలకోసం బీజేపీ పనిచేస్తోందన ఆయన వెల్లడించారు.
తెలంగాణ అప్పుల ఊబిలో ఉండిపోయిందని, తెలంగాణలో న్యాయం జరగాలంటే మోడీ పాలన రావాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీలను బద్దలుకొడతామని, స్వచ్ఛందంగా సభకు తరలివచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించినందుకు రుణపడి ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!