Bandi Sanjay : గడీ పాలనను బద్దలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
bandi Sanjay speech at bjp vijaya sankalpa sabha.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సహా ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇంతమందిని చూస్తుంటే నాకు సంతోషంగా వుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధ కలిగిస్తాయన్న బండి సంజయ్.. నరేంద్రమోడీ మీద తప్పుడు భాష ఉపయోగిస్తున్నారన్నారు. ఆయన్ని ఎందుకు తిట్టాలి. పేదలను ఆదుకున్నందుకు తిట్టాలా? ఆకలితో అలమటించకుండా ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా..? ఉక్రెయిన్ లో విద్యార్ధులు చిక్కకుంటే వారిని కాపాడినందుకా..? అని ఆయన ప్రశ్నించారు. మనం ఇంకా భరిద్దామా.. గడీ పాలన నుంచి తెలంగాణ తల్లి బంధ విముక్తిని చేయాలి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
భారతదేశం కాదు.. ఎక్కడికి వెళ్ళినా మోడీకి ఘనంగా స్వాగతిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ గొప్పతనం కేసీఆర్ కి తెలియదని, ఎంతోమంది బలిదానం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాం.. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ఒక పథకం ప్రకారం మోడీని తిడుతున్నారని, మోడీని విమర్శించడం ద్వారా రాజకీయ లబ్ధికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మోడీ తెలంగాణ గురించి ఆలోచించారు.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. పేద ప్రజలకోసం బీజేపీ పనిచేస్తోందన ఆయన వెల్లడించారు.
తెలంగాణ అప్పుల ఊబిలో ఉండిపోయిందని, తెలంగాణలో న్యాయం జరగాలంటే మోడీ పాలన రావాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీలను బద్దలుకొడతామని, స్వచ్ఛందంగా సభకు తరలివచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలని, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించినందుకు రుణపడి ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!