DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..
- మూడో బిడ్డకు తండ్రైన దినేష్ కార్తీక్..
- చిన్నారికి 'రాహా' అని నామకరణం..
- సోషల్ మీడియాలో రాహా ఫోటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పల్లికల్ దంపతులు తమ ఇంట్లోకి కొత్త అతిథి వచ్చిందని సంతోషంగా ప్రకటించారు. వీరికి ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు ‘రాహా పల్లికల్ కార్తీక్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వీరికి ఇప్పటికే కబీర్, జియాన్ అనే ఇద్దరు కవల కొడుకులు ఉన్నారు. ఇప్పుడు తమ కొడుకులకు తోడుగా చిన్న చెల్లాయి వచ్చిందని వారు మురిసిపోతున్నారు.
దీపికా , దినేష్ కార్తీక్ ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ.. ‘మా మనసు నిండా దేవుని ఆశీస్సులు, చెప్పలేనంత కృతజ్ఞతతో మా ముద్దుల పాపను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాము. కబీర్, జియాన్ తమ చిన్న చెల్లాయి రాహాను పరిచయం చేస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు’ అని రాశారు.
Also Read
- IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
శుభాకాంక్షలు తెలిపిన కోహ్లీ, సానియా మీర్జా
ఈ దంపతులకు క్రీడా లోకం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ పోస్ట్పై స్పందిస్తూ హార్ట్ ఎమోజీని పెట్టారు. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా దినేష్ కార్తీక్ దంపతులకు అభినందనలు తెలిపారు.
దినేష్ కార్తీక్ భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా సుదీర్ఘ కాలం ఆడారు. సుమారు 20 ఏళ్లకు పైగా టెస్టులు, వన్డేలు, టీ20ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, ఆయన ఇప్పుడు కామెంటేటర్గా, కోచ్గా రాణిస్తున్నారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు మెంటార్గా , బ్యాటింగ్ కోచ్గా కూడా పనిచేశారు.
దీపికా పల్లికల్ భారతదేశపు గొప్ప స్క్వాష్ క్రీడాకారిణి. ప్రపంచ స్క్వాష్ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి చేరిన మొదటి భారతీయ మహిళ ఈమె. ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామన్వెల్త్ , ఆసియా క్రీడల్లో ఎన్నో పతకాలు సాధించారు. 2022లో పిల్లల కోసం విరామం తీసుకున్న తర్వాత, ఆమె మళ్లీ క్రీడల్లోకి వచ్చి అద్భుతమైన ఫామ్ చాటుకున్నారు. 2023లో జరిగిన హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణ పతకం సాధించడం విశేషం.
ప్రస్తుతం ఈ క్రీడా జంట తమ మూడో బిడ్డ రాకతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!