-
Disruption of UPI Services: అలర్ట్.. రెండ్రోజుల పాటు యూపీఐ సేవల నిలిపివేత!
యూపీఐ గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. -
Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత వెనుక చైనా హస్తం?
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది. -
MBA in USA: అమెరికాలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? చౌకైన వర్సిటీలు, ఫీజులు..
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ కోర్సు చదవడానికి అమెరికాలో అనేక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతదేశం నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు ఎంబీఏ చదవడానికి అమెరికన్ విశ్వవిద్యాలయాలకు వెళతారు. అయితే ఈ యూనివర్శిటీల ఫీజులు చాలా ఎక్కువగా ఉండటం వల్ల భయపడుతుంటారు. -
Ayushi’s Startup Journey: కోటి రూపాయల ఉద్యోగం వదిలి.. కంపెనీని స్థాపించిన యువతి.. కట్ చేస్తే…
వ్యాపారాన్ని ప్రారంభించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ధైర్యం, అభిరుచి ఉంటే ఏదైనా సులభమే అవుతుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ అమ్మాయి దీన్ని నిరూపించింది. ఆమె కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ ప్రారంభించింది. ఈ రోజు తన కంపెనీ ఆదాయం రూ.40 కోట్లకు పైగా ఉంది. ఆమె విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది. -
Parliament Sessions: ఈనె 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పెద్ద ఎత్తున దుమారం ఖాయం?
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
India-Canada: కెనడా అధికారికి భారత్ సమన్లు.. ఇరు దేశాల మధ్య విభేదాలకు కారణాలేంటి?
ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఛాందసవాదుల విషయంలో భారత్తో సంబంధాలను చెడగొట్టేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. ఈసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ భారత హోం మంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. ఖలిస్తానీ ఉగ్రవాదులను టార్గెట్ చేసేందుకు అమిత్ షా కుట్ర పన్నారని మోరిసన్ ఆరోపించారు. -
Rajnath Singh: భద్రతా లోపం లేదు.. వరుస ఉగ్రదాడులపై స్పందించిన రక్షణ మంత్రి..
జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. -
US Bans Indian Companies:15 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. కారణం?
రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతిస్తున్నారనే ఆరోపణలతో 15 భారతీయ కంపెనీలతో సహా 275 మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయ్లాండ్, టర్కీకి చెందిన కంపెనీలను కూడా రష్యాకు అత్యాధునిక సాంకేతికత, పరికరాలను సరఫరా చేసినందుకు నిషేధించామని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా తన యుద్ధ యంత్రాంగానికి ఈ కంపెనీలు మద్దతు తెలిపాయని ఆరోపించింది. -
Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ
ఢిల్లీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గొడవల కారణంగా ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్ కోసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేరానికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
Ayodhya: అయోధ్యలో 25 లక్షలకు పైగా దీపాల అద్భుత దృశ్యం.. రెండు గిన్నిస్ రికార్డులు
అయోధ్య దీపోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్లో రెండు రికార్డులు నమోదయ్యాయి. 1121 మంది అర్చకులు కలిసి సరయు మహా హారతి చేశారు. దీంతో 25 లక్షల 12 వేల 585 దీపాలు వెలిగించారు. రాంలాలా సన్నిధిలో జరిగే తొలి దీపోత్సవంలో ఈసారి యోగి ప్రభుత్వం అద్వితీయమైన చొరవ తీసుకుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!