ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ షరతులు విధించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఆధునిక జీవనశైలి కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సకాలంలో చికిత్స పొందకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శారీరక, మానసికంగా ప్రభావితులవుతారు. ఒత్తిడి వల్ల నియంత్రణ కోల్పోతారు. ఇది చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది.
జూన్ 1 నుంచి మీ ఇంటి ఖర్చులకు సంబంధించిన నియమాలలో మార్పులు జరగనున్నాయి. ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. గతంలో కంటే ఈసారి కూడా నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్, బ్యాంక్ సెలవులు, ఆధార్ అప్డేట్, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన నిబంధనలలో మార్పులు ఉంటాయి.
రైతే రాజు అని చెబుతుంటే వింటుంటాం. ఓ వీడియోలో ప్రత్యక్షంగా చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పశువులకు మోత తీసుకెళ్లేందుకు సాధారణంగా రైతులు ఎద్దులబండి, రిక్షాలు ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పోర్షే లగ్జరీ కారులో పశువులకు గడ్డి తరలిస్తున్న ఓ మహిళ రైతు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడిపాడు. కాగా ఈ కేసునులో ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్లోని రాజ్కోట్ వీడియో గేమ్జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది.
సార్వత్రిక ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిపై కడప పోలీసులు ఉక్కు పాదం మోపారు. ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్పడ్డ 40 మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో ఉన్న వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజం పై గాయాలు అయ్యాయన్నారు.
తనపై నమోదైన కేసుల్లో ముందస్తు మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది.