Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత వెనుక చైనా హస్తం?
- మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత
- దీని వెనుక చైనా హస్తం ఉంది?
- ఎస్ఈసీ ఫైలింగ్ ఏం పేర్కొంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది. అయితే.. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలను ఉటంకిస్తూ నాదెళ్ల తన నగదు పరిహారాన్ని తగ్గించాలని అభ్యర్థించినట్లు కూడా ఫైలింగ్ వెల్లడించింది. ఈ నిర్ణయం వెనుక ‘చైనా కోణం’ గురించి కూడా సూచించారు.
ఎస్ఈసీ ఫైలింగ్ ఏం పేర్కొంది?
ఎస్ఈసీ ఫైలింగ్ ప్రకారం.. FY2024లో నాదెళ్ల ప్యాకేజీలో $71.2 మిలియన్ (దాదాపు రూ. 600 కోట్లు) విలువైన స్టాక్ అవార్డు ఉంది. అదేవిధంగా.. ఆయన ఈక్విటీయేతర ప్రోత్సాహక ప్రణాళికగా 52 లక్షల డాలర్లు (దాదాపు రూ. 44 కోట్లు) పొందుతారు. ఆయన మూల వేతనం 25 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల కంటే ఎక్కువ). ఇతర అలవెన్సులు $170,000 (సుమారు రూ. 15 లక్షలు) కూడా అందుకుంటారు. కానీ ఆయన నగదు ప్రోత్సాహకం $10.7 మిలియన్ల నుంచి $52 మిలియన్లకు తగ్గించబడింది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
అనేక సైబర్ భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొన్న కంపెనీ..
పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, ఉల్లంఘనల కారణంగా నాదెళ్ల జీతంలో కోత విధించినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇటీవల అనేక సైబర్ భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొంది. జూలై 2023లో గ్లోబల్ అవుట్డేజ్ Windows వినియోగదారులను ప్రభావితం చేసింది. ముందుగా ఏప్రిల్లో యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఒక నివేదికను ప్రచురించింది. అమెరికా అధికారుల ఇమెయిల్ అకౌంట్లను చైనా ఉల్లంఘించిందని చెప్పబడింది. మైక్రోసాఫ్ట్ జూలైలో ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరిలో.. రష్యన్ ఇంటెలిజెన్స్ కొంతమంది అగ్ర మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ల ఇమెయిల్ ఖాతాలను యాక్సెస్ చేసింది.
జీతం కోతపై వివరణ..
ఎస్ఈసీ ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల పనితీరు కొలమానాల నుంచి వైదొలగాలని, భద్రత పట్ల తన వ్యక్తిగత నిబద్ధత, సీఈవోగా తన పాత్రను దృష్టిలో ఉంచుకుని తన నగదు ప్రోత్సాహకాలను తగ్గించాలని బోర్డుని కోరినట్లు తెలిపారు. నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారు. ఆయన తన పదవీకాలంలో కంపెనీ ఆదాయాలు దాదాపు మూడు రెట్లు పెరిగి $245.1 బిలియన్లకు చేరుకున్నాయి. నికర ఆదాయం నాలుగు రెట్లు పెరిగి $88.1 బిలియన్లకు చేరుకుంది. ఒక్కో షేరుకు సంపాదన $11.80కి పెరిగింది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..