Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత వెనుక చైనా హస్తం?
- మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత
- దీని వెనుక చైనా హస్తం ఉంది?
- ఎస్ఈసీ ఫైలింగ్ ఏం పేర్కొంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది. అయితే.. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలను ఉటంకిస్తూ నాదెళ్ల తన నగదు పరిహారాన్ని తగ్గించాలని అభ్యర్థించినట్లు కూడా ఫైలింగ్ వెల్లడించింది. ఈ నిర్ణయం వెనుక ‘చైనా కోణం’ గురించి కూడా సూచించారు.
ఎస్ఈసీ ఫైలింగ్ ఏం పేర్కొంది?
ఎస్ఈసీ ఫైలింగ్ ప్రకారం.. FY2024లో నాదెళ్ల ప్యాకేజీలో $71.2 మిలియన్ (దాదాపు రూ. 600 కోట్లు) విలువైన స్టాక్ అవార్డు ఉంది. అదేవిధంగా.. ఆయన ఈక్విటీయేతర ప్రోత్సాహక ప్రణాళికగా 52 లక్షల డాలర్లు (దాదాపు రూ. 44 కోట్లు) పొందుతారు. ఆయన మూల వేతనం 25 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల కంటే ఎక్కువ). ఇతర అలవెన్సులు $170,000 (సుమారు రూ. 15 లక్షలు) కూడా అందుకుంటారు. కానీ ఆయన నగదు ప్రోత్సాహకం $10.7 మిలియన్ల నుంచి $52 మిలియన్లకు తగ్గించబడింది.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
అనేక సైబర్ భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొన్న కంపెనీ..
పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, ఉల్లంఘనల కారణంగా నాదెళ్ల జీతంలో కోత విధించినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇటీవల అనేక సైబర్ భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొంది. జూలై 2023లో గ్లోబల్ అవుట్డేజ్ Windows వినియోగదారులను ప్రభావితం చేసింది. ముందుగా ఏప్రిల్లో యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఒక నివేదికను ప్రచురించింది. అమెరికా అధికారుల ఇమెయిల్ అకౌంట్లను చైనా ఉల్లంఘించిందని చెప్పబడింది. మైక్రోసాఫ్ట్ జూలైలో ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరిలో.. రష్యన్ ఇంటెలిజెన్స్ కొంతమంది అగ్ర మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ల ఇమెయిల్ ఖాతాలను యాక్సెస్ చేసింది.
జీతం కోతపై వివరణ..
ఎస్ఈసీ ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల పనితీరు కొలమానాల నుంచి వైదొలగాలని, భద్రత పట్ల తన వ్యక్తిగత నిబద్ధత, సీఈవోగా తన పాత్రను దృష్టిలో ఉంచుకుని తన నగదు ప్రోత్సాహకాలను తగ్గించాలని బోర్డుని కోరినట్లు తెలిపారు. నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారు. ఆయన తన పదవీకాలంలో కంపెనీ ఆదాయాలు దాదాపు మూడు రెట్లు పెరిగి $245.1 బిలియన్లకు చేరుకున్నాయి. నికర ఆదాయం నాలుగు రెట్లు పెరిగి $88.1 బిలియన్లకు చేరుకుంది. ఒక్కో షేరుకు సంపాదన $11.80కి పెరిగింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!