Satya Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత వెనుక చైనా హస్తం?
- మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత
- దీని వెనుక చైనా హస్తం ఉంది?
- ఎస్ఈసీ ఫైలింగ్ ఏం పేర్కొంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది. అయితే.. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలను ఉటంకిస్తూ నాదెళ్ల తన నగదు పరిహారాన్ని తగ్గించాలని అభ్యర్థించినట్లు కూడా ఫైలింగ్ వెల్లడించింది. ఈ నిర్ణయం వెనుక ‘చైనా కోణం’ గురించి కూడా సూచించారు.
ఎస్ఈసీ ఫైలింగ్ ఏం పేర్కొంది?
ఎస్ఈసీ ఫైలింగ్ ప్రకారం.. FY2024లో నాదెళ్ల ప్యాకేజీలో $71.2 మిలియన్ (దాదాపు రూ. 600 కోట్లు) విలువైన స్టాక్ అవార్డు ఉంది. అదేవిధంగా.. ఆయన ఈక్విటీయేతర ప్రోత్సాహక ప్రణాళికగా 52 లక్షల డాలర్లు (దాదాపు రూ. 44 కోట్లు) పొందుతారు. ఆయన మూల వేతనం 25 లక్షల డాలర్లు (రూ. 21 కోట్ల కంటే ఎక్కువ). ఇతర అలవెన్సులు $170,000 (సుమారు రూ. 15 లక్షలు) కూడా అందుకుంటారు. కానీ ఆయన నగదు ప్రోత్సాహకం $10.7 మిలియన్ల నుంచి $52 మిలియన్లకు తగ్గించబడింది.
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
అనేక సైబర్ భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొన్న కంపెనీ..
పెరుగుతున్న సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు, ఉల్లంఘనల కారణంగా నాదెళ్ల జీతంలో కోత విధించినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇటీవల అనేక సైబర్ భద్రతా ఉల్లంఘనలను ఎదుర్కొంది. జూలై 2023లో గ్లోబల్ అవుట్డేజ్ Windows వినియోగదారులను ప్రభావితం చేసింది. ముందుగా ఏప్రిల్లో యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఒక నివేదికను ప్రచురించింది. అమెరికా అధికారుల ఇమెయిల్ అకౌంట్లను చైనా ఉల్లంఘించిందని చెప్పబడింది. మైక్రోసాఫ్ట్ జూలైలో ఈ విషయాన్ని వెల్లడించింది. జనవరిలో.. రష్యన్ ఇంటెలిజెన్స్ కొంతమంది అగ్ర మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ల ఇమెయిల్ ఖాతాలను యాక్సెస్ చేసింది.
జీతం కోతపై వివరణ..
ఎస్ఈసీ ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల పనితీరు కొలమానాల నుంచి వైదొలగాలని, భద్రత పట్ల తన వ్యక్తిగత నిబద్ధత, సీఈవోగా తన పాత్రను దృష్టిలో ఉంచుకుని తన నగదు ప్రోత్సాహకాలను తగ్గించాలని బోర్డుని కోరినట్లు తెలిపారు. నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారు. ఆయన తన పదవీకాలంలో కంపెనీ ఆదాయాలు దాదాపు మూడు రెట్లు పెరిగి $245.1 బిలియన్లకు చేరుకున్నాయి. నికర ఆదాయం నాలుగు రెట్లు పెరిగి $88.1 బిలియన్లకు చేరుకుంది. ఒక్కో షేరుకు సంపాదన $11.80కి పెరిగింది.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..