Parliament Sessions: ఈనె 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పెద్ద ఎత్తున దుమారం ఖాయం?
- నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- డిసెంబర్ 20 వరకు కొనసాగింపు
- పలు కీలక బిల్లులపై చర్చ
- వన్ నేషన్-వన్ ఎలక్షన్.. వక్ఫ్ బిల్లుపై దుమారం రేగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు వన్ నేషన్-వన్ ఎలక్షన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణం లేదని, ఇది సాధ్యం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది కాకుండా.. వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన జేపీసీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో సమర్పించవచ్చు. దీనిపై దుమారం రేగే అవకాశాలు కూడా ఉన్నాయి. వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పైను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆమోదించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా గతంలో తెలిపిన విషయం విదితమే.
READ MORE: CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
నవంబర్ 26న లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని పిలవవచ్చు. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న ఈ ఉభయ సభలు జరగనున్నాయి. పాత పార్లమెంట్ హౌస్లో ఒకరోజు ఉభయ సభలు జరిగే అవకాశం ఉంది. పాత పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ సభలో ఈ ప్రత్యేక ఉభయ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ స్థలంలోనే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. అందుకే ఇప్పుడు నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది.
READ MORE:CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో వైస్ ఛాన్సలర్ల భేటీ.. దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!