Parliament Sessions: ఈనె 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పెద్ద ఎత్తున దుమారం ఖాయం?
- నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- డిసెంబర్ 20 వరకు కొనసాగింపు
- పలు కీలక బిల్లులపై చర్చ
- వన్ నేషన్-వన్ ఎలక్షన్.. వక్ఫ్ బిల్లుపై దుమారం రేగే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు వన్ నేషన్-వన్ ఎలక్షన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణం లేదని, ఇది సాధ్యం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది కాకుండా.. వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన జేపీసీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో సమర్పించవచ్చు. దీనిపై దుమారం రేగే అవకాశాలు కూడా ఉన్నాయి. వక్ఫ్ (సవరణ) బిల్లు 2024పైను పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఆమోదించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా గతంలో తెలిపిన విషయం విదితమే.
READ MORE: CM Chandrababu: రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Also Read
నవంబర్ 26న లోక్సభ, రాజ్యసభ ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని పిలవవచ్చు. రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న ఈ ఉభయ సభలు జరగనున్నాయి. పాత పార్లమెంట్ హౌస్లో ఒకరోజు ఉభయ సభలు జరిగే అవకాశం ఉంది. పాత పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ సభలో ఈ ప్రత్యేక ఉభయ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ స్థలంలోనే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. అందుకే ఇప్పుడు నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చింది.
READ MORE:CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో వైస్ ఛాన్సలర్ల భేటీ.. దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!