-
Delhi CM : ఎల్లుండే రాజధానిలో ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీ సీఎం పదవి ఎవరికి?
ఎల్లుండి రాంలీల మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. -
Maha Kumbh 2025: వామ్మో.. కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది స్నానాలు చేశారా? యూపీ సర్కార్ ప్రకటన
మహా కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ. ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు.. టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. కాగా.. తాజాగా కుంభమేళాలో స్నానమాచరించిన భక్తుల సంఖ్యను యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 55 కోట్ల మంది మహా కుంభమేళాలో స్నానం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. -
Cancer Vaccine: ఐదారు నెలల్లో క్యాన్సర్ టీకా.. వారికి మాత్రమే అందిస్తామన్న కేంద్ర మంత్రి
మహిళల్లో క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మహిళలను వేధిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ అన్నారు. తొమ్మిది నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు అందిస్తామన్నారు. -
Fact Check: రోహిత్ శర్మకు పాకిస్థాన్లో కూడా అంత క్రేజ్ ఉందా? ఈ వైరల్ వీడియోలో నిజమెంత?
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్థాన్- న్యూజిలాండ్తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇక, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ ఇది. -
Satyendra Jain: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రిపై విచారణకు రాష్ట్రపతి అనుమతి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కష్టాలు పెరిగాయి. సత్యేంద్ర జైన్పై విచారణ జరపాలని కోరుతూ దాఖలైన ఫైల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు . రత పౌర రక్షణ నియమావళిలోని సెక్షన్ 218 కింద 60 ఏళ్ల జైన్పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని అనుమతి కోరింది. -
Bikes: మార్కెట్లోకి కొత్తగా ఈవీ, సీఎన్జీ బైక్స్.. మరి డీజిల్ బైక్స్ను ఎందుకు తయారు చేయరు?
బైక్, కారు, బస్సు, జీప్, ట్రక్, విమానం అన్నింటికీ వేర్వేరు ఇంధనం అవసరం. బైక్లు పెట్రోల్తో నడుస్తాయి. మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో ఈవీ, సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ.. డీజిల్ తో నడిచే బైక్స్ మాత్రం మార్కెట్లో లేవు. అసలు డీజిల్ ఇంజిన్లను బైక్స్కు ఎందుకు అమర్చరు? ఒక వేళ తయారు చేసి మర్చితే ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం.. READ MORE: Big twist in Vallabhaneni […] -
Mamata Banerjee: మహా కుంభమేళాపై సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవలి తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ.. మహా కుంభ్ను 'మృత్యు కుంభ్' అన్నారు. ఈ కుంభమేళాలో వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని.. పేదలు దానికి సౌకర్యాలు కరువయ్యాయన్నారు. -
Aprilia Tuono 457: ఇటాలియన్కు చెందిన 457 సీసీ స్పోర్ట్ బైక్ విడుదల.. ధర తక్కువే!
ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అప్రిలియా భారతదేశంలో తన పోర్ట్ఫోలియోను విస్తరించింది. కొత్త మోటార్సైకిల్ టువోనో 457ను అధికారికంగా విడుదల చేసింది. ఇది భారత మార్కెట్లో అత్యంత చౌకైన అప్రిలియా బైక్! దీని ప్రారంభ ధర రూ. 3.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. -
YS Jagan: వైఎస్ జగన్ను కలవాలంటూ బోరున ఏడ్చిన చిన్నారి.. జగన్ ఏం చేశాడో చూడండి…
విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ కలిసిన విషయం తెలిసిందే. విజయవాడలో మాజీ సీఎంను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. -
Manchu Manoj: చంద్రగిరి జల్లికట్టు వేడుకలో మంచు మనోజ్.. అభిమానుల్లో జోష్..
తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ నటుడు, టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు మనోజ్కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్ను ఆహ్వానించారు. హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరవడంతో.. యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని, గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మనోజ్ కూడా సంతోషం వ్యక్తం […]
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!