India-Iran: ఇరాన్లో భారతీయులకు కేంద్రం తాజా హెచ్చరికలు ఇవే!
- ఇరాన్లో భారతీయులకు ఎంబసీ సలహా
- భూ సరిహద్దులు దాటే వారికి హెచ్చరికలు
- అలా చేయొద్దని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్లోని భారతీయులకు మరోసారి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భూ సరిహద్దుల ద్వారా ఇరాన్ దాటి వెళ్లొద్దని సూచించింది. తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా లేదా తమతో సమన్వయం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దును దాటే ప్రయత్నం చేయొద్దని స్థానిక భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో భూసరిహద్దుల గుండా స్వయంగా ప్రయాణించే వారు ఇమ్మిగ్రేషన్, డాక్యుమెంటేషన్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశముందని రాయబార కార్యాలయం హెచ్చరించింది. ఎవరు అయినా దేశం విడిచి వెళ్లే ముందు తప్పనిసరిగా టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి సూచనలు తీసుకోవాలని సూచించింది.
Also Read
- Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
- Petrol-Diesel Price Hike: ఆ దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 434, డీజిల్ రూ. 407.
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!

రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ఇరాన్లో ఉన్న భారతీయులు ముందస్తు అనుమతి, స్పష్టమైన సమన్వయం లేకుండా భూసరిహద్దు దాటే ప్రయత్నం చేయకూడదు.’’ అని పేర్కొంది. ఎంబసీకి తెలియకుండా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇమ్మిగ్రేషన్ అనుమతులు, పక్క దేశాల్లో ప్రవేశానికి అవసరమైన డాక్యుమెంట్లు, సరిహద్దు చెక్పోస్టుల దగ్గర ఉండే నియమాలు వంటి అంశాలు సమస్యలకు దారితీయవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఎంబసీతో సమన్వయం లేకుండా దేశం బయటకు వెళ్లినట్లయితే ఆ తర్వాత తలెత్తే సమస్యల్లో సహాయం చేయడం కష్టమవుతుందని కూడా స్పష్టం చేసింది.
ఇరాన్లో ఉన్న భారతీయులు అధికారిక సమాచార మార్గాల ద్వారా రాయబార కార్యాలయంతో అనుసంధానంగా ఉండాలని, తాజా సూచనలను పాటించాలని అధికారులు కోరారు. విదేశాల్లో భద్రత, ప్రయాణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పుడు పౌరుల రక్షణ కోసం ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తారని తెలిపారు. కాబట్టి ఇరాన్లో ఉన్న భారతీయులు స్వతంత్రంగా భూసరిహద్దుల వైపు ప్రయాణం చేయకుండా.. ముందుగా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Movie Update : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్కు చేరిన ఓపెనర్స్..
-
LIC: ఎల్ఐసీ కొత్త వ్యూహం.. ఫిన్టెక్ రంగంలోకి ఎంట్రీ? ఫోన్పే, పేటీఎంకు పోటీగా సేవలు!
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!