కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. విచారణలో ఈ వాదన తప్పు అని తేలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిసింది.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి వేములవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రాజన్న సిరిసిల్ల జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేస్తారు. రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు, రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ…
కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో కుంగిన భవనం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రస్తుతం ఒరిగిన భవనంతో పాటు.. ఆ చుట్టూ ప్రక్కల ఉన్న భవనాలు అన్నింటినీ పర్మిషన్ లేకుండా నిర్మించినవే అని తేలింది. 50 నుంచి 100 గజాల లోపు ఉన్న చిన్న స్థలాల్లో 4, 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు భవన యజమానులు. నిర్మాణ సమయంలో ముడుపులు అందుకుని సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. భవన యజమానులు ఒక్కో అంతస్తుకు అనుమతి తీసుకుని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టారు.
సీఎం రేవంత్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. "కేసీఆర్ మర్రిచెట్టు.. నువ్వు గంజాయి మొక్క. నన్ను రాక్షసుడు అంటున్నావ్.. ప్రజల కోసం నేను రాక్షసుడినే. నిన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాడని ఆశ ఉండే. అబద్ధాలు, ప్రమాణాలు చేసి రేవంత్ అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి చీటర్, అబద్ధాల కోరు. తెలంగాణ ద్రోహి. తెలంగాణా కోసం నువ్వేం చేశావ్.. తెలంగాణా కోసం టీడీపీలో ఉన్న అందరం రాజీనామా చేస్తే నువ్వు తప్పించుకు పోయావ్. కాళోజీ నారాయణరావు…
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజ్కుమార్ రోడ్డులోని ఈవీ స్కూటర్ షోరూమ్లో మంటలు చెలరేగాయి. షోరూంలో పార్క్ చేసిన వాహనాలన్నీ దగ్ధమైనట్లు సమాచారం.
మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగింది. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం విచ్చేసిన కార్మికుడి కుమారుడు జంతర్ (5)పై లైంగిక దాడికి యత్నించాడు. పక్కనే పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా బాలుడికి పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు.
బయట ఏం తిన్నాలన్న ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ప్రతీ దాంట్లో కల్తీ జరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నేరేడ్మెట్ గ్రీన్ బావర్చిలో బిర్యాని తిని.. వాంతులు విరేచనాలతో హాస్పిటల్లో చేరినట్లు రవి అనే యువకుడు తెలిపాడు.
తెలంగాణలో ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఈరోజు మరోసారి గ్రూప్-1కు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. Go-29 అంశంతో పాటు ఇతర పిటిషన్ల పై నేడు హై కోర్టులో కీలక విచారించనున్నారు. నేటి హై కోర్టు విచారణపై అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.