India T20 World Cup 2026 Squad: 2026 టీ20 వరల్డ్ కప్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. 20 జట్లతో జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుంది. భారత్ తన టైటిల్ను నిలబెట్టుకుంటుందా అనే అంశంపై అందరి దృష్టి ఉంది. అందుకు తొలి అడుగు డిసెంబర్ 20, శనివారం పడనుంది. ఆ రోజు జాతీయ సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించనున్నారు. ముంబైలో అగార్కర్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి…
Hardik Pandya: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 16 బంతుల్లో తన ఏడవ T20 అంతర్జాతీయ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Alcohol Affects: చాలామంది మానసిక ఉల్లాసం, ఆనందం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ను మితంగా తీసుకున్నప్పుడు మెదడులో డోపమైన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదలై తాత్కాలికంగా హుషారు, ఆనందం కలుగుతుంది. అయితే తినేదైనా, తాగేదైనా పరిమితి మించితే సమస్యలు తప్పవు. ఆల్కహాల్ విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఎందుకంటే అతిగా మద్యం తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి, గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది, శ్వాస కూడా నెమ్మదిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒమన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాని స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, గౌరవ వందనం వంటి కార్యక్రమాలతో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అంశం ఆసక్తిని రేపింది. ఈ పర్యటనలో మోడీ ఎడమ చెవి పక్కన ఏదో కనిపించింది. ఇది ఒక చెవి ఆభరణంలాంటి వస్తువు. ఇది మోడీ కొత్త స్టైల్? అనే ప్రచారం మొదలైంది.
Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన స్వగృహాన్ని మార్టిగేజ్(తాకట్టు) పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7.50లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత, తండ్రి రామచంద్రం…
Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి ఉలిక్కిపడింది. భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించిన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత, ఢాకాలో హింస చెలరేగింది. నిరసనకారులు రెండు వార్తాపత్రిక కార్యాలయాలను తగలబెట్టారు. భారత హైకమిషన్ను చుట్టుముట్టారు. కమషన్ భవనంపై రాళ్ళు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజకీయ అస్థిరతతో పోరాడుతున్న బంగ్లాదేశ్ భారతదేశానికి ఆందోళనకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. భారత్ ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా సైతం ఉగ్రవాదుల నియంత్రణలోకి వస్తే.. జైష్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు…
Hyderabad: హైకోర్టులో లుంబినీ పార్క్, గోకుల్చాట్ పేలుళ్ల కేసు విచారణకు వచ్చింది. కింది కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని నేరస్థులు హైకోర్టును ఆశ్రయించారు. నేరస్థుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితి, పశ్చాత్తాప స్థితిగతులపై హైకోర్టు ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. కేసు విచారణను మరో బెంచ్కు మార్చాలన్న నేరస్థుల లాయర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్ పిటిషన్ల విచారణ వాయిదా వేసింది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది.. నిన్నటితో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ పూర్తయింది. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. విచారణలో ఆయన నోరు విప్పలేదు. కీలక సమాచారం ఏదీ ఇవ్వలేదని సిట్ తెలిసింది. నిబంధనల ప్రకారమే పనిచేశానని చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఆదేశాలతోనే చేశానని తెలిపారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్పై స్పష్టత ఇవ్వలేదు. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్…
Hyderabad: ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాది సాజిద్ గురించి విస్తూపోయే విషయాలు బయటికి వచ్చాయి.. సాజిద్పై కేంద్ర, రాష్ట్ర అధికారుల విచారణ చేపట్టారు.. ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసా కోసం 27 సార్లు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇప్పటికీ ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ వీసాను పొందలేకపోయాడు.
Bangladesh: బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా భాలుకాలో గురువారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఓ హిందూ వర్కర్ని కొట్టి చంపేశారు. ఈ ఘటన భాలుకాలోని స్క్వేర్ మాస్టర్ బారి ప్రాంతంలోని దుబాలియా పారా వద్ద జరిగింది. కొట్టిచంపిన తర్వాత దుండగులు ఆ యువకుడి మృతదేహాన్ని ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారని భాలుకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిపోన్ మియా "బీబీసీ బంగ్లా"కు తెలిపారు. మృతుడిని దీపు చంద్ర దాస్గా గుర్తించారు. అతడు స్థానిక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ..…