Ahmed Shehzad: “భారత్ను చూసి బుద్ధి తెచ్చుకోండి”.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmed Shehzad: భారత్ చరిత్ర సృష్టించింది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఏకైక టీమ్గా హిస్టరీ సాధించింది. భారత్ గెలుపుతో పాకిస్థాన్ క్రికెట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. భారత్కు కలసి రాదు అనుకున్న అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేయడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. సొంత దేశం పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. టీమిండియా విజయానికి భారత క్రికెట్లోని క్రమశిక్షణ, పటిష్టమైన వ్యవస్తే కారణం అంటూ సొంత దేశం క్రికెట్ బోర్డు, ప్లేయర్స్పై విమర్శలు గుప్పించాడు. భారత్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించాడు. ముఖ్యంగా సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని షెహజాద్ హితవు పలికాడు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
భారత్ ఓ పద్ధతిగా వెళ్తోంది. జట్టులో చోటు కోసం పరితపించిన సంజూ ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. క్రమశిక్షణ లేదని పక్కన పెట్టిన ఇషాన్ కిషన్ గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చాడు. ఒత్తిడిలో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లో కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు స్కోర్ చేశాడని టీమిండియా ప్లేయర్స్ ప్రతిభను ప్రశంసించాడు. అంతేకాదు.. అహ్మద్ షెహజాద్ పాకిస్థాన్ ప్లేయర్స్పై సెటైర్లు వేశాడు. ఉగాండా, కెన్యా, జింబాబ్వే వంచి చిన్న జట్లపై గెలిచి సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించాడు. భారత్ మాత్రం పెద్ద జట్లతో ఆడి గెలుస్తుందని తెలిపాడు. ఒక వేళ పాకిస్థాన్ ఫైనల్కు చేరి ఉంటే 180 పరుగులు చేసి బౌలర్లు కాపాడతారని ఆశించే వాళ్లం. కానీ.. టీమిండియా మాత్రం ఏకంగా 250 పరుగులకు స్కోర్ చేసి మ్యాచ్న వన్ సైడ్ చేసిందని భారత్ తెగువను గుర్తు చేశాడు. ఇక అహ్మద్కు చెందిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!