Bangladesh: బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లా లింఛింగ్ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు దేశ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ శనివారం తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని 27 ఏళ్ల సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్గా యూనస్ ప్రభుత్వం గుర్తించింది. ఎక్స్ (ట్విటర్)లో చేసిన పోస్టులో యూనస్.. “మైమెన్సింగ్లోని భలుకా ప్రాంతంలో సనాతన హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ను కొట్టి చంపిన ఘటనలో ర్యాపిడ్ యాక్షన్ బ్యాటాలియన్ (RAB) ఏడుగురిని అనుమానితులుగా అరెస్ట్ చేసింది” అని పేర్కొన్నారు. అరెస్ట్…
Actress Amani Joins BJP: ప్రముఖ సినీనటి ఆమని బీజేపీలో చేరింది. శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఆమని రాజకీయంలోకి అడుగుపెట్టింది. బీజేపీలో ఆమని ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. ఆమెకు ఉన్న అభిమాన బలం, సామాజిక అంశాలపై గతంలో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు బీజేపీకి ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో నటి భేటీ అయ్యింది.…
Dhurandhar: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ దూకుడు పెరిగింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ రాజకీయ–యాక్షన్ సినిమా దాదాపు అన్ని సంప్రదాయ నియమాలను దాటేస్తోంది. ఇటీవలి కాలంలో థియేటర్ లో ఆడి విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మూడు గంటల 33 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రజలకు ఆకట్టుకుంటోంది. సెలవులు లేవు, పండుగ సీజన్ కాకపోయినప్పటికీ.. విడుదలైన 15 రోజుల్లో భారత్లోనే దాదాపు రూ.500 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. ఇదే తరహా ఊపు కొనసాగితే.. ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల క్లబ్లోకి…
Congress: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్ను ఎందుకు బుజ్జగించలేదు.. సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయ్యిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు రెండు,…
Hyderabad: హైదరాబాద్ అమీర్పేట్లోని ప్రిస్టిన్ కేర్ zoi హాస్పిటలో డ్రగ్లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఈ ఆసుపత్రిలో ఓ పాత నేరస్థుడు ఆసిఫ్ డ్రగ్స్తో పట్టుబడ్డాడు. 2024లో ఆసిఫ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.గత ఏడాది అక్టోబర్లో ముంబై నుంచి mdma డ్రగ్ను తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తుండగా పట్టుకున్నారు. 2025 మేలో బెయిల్ పైన బయటకు వచ్చాడు నేరస్థుడు ఆసిఫ్.. ఈజీ మనీకి అలవాటు పడి, డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. తాజాగా అమీర్పేట్లోని ప్రిస్టిన్ కేర్ జోయ్ హాస్పిటల్లోని కెఫెటేరియాలో చేరాడు. గుజరాత్…
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం న్యాయస్థానానికి చేరింది. 300 డివిజన్లకు సంబంధించిన వార్డు మ్యాప్లు, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలు అమలైతే పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై తాత్కాలికంగా…
Hardik Pandya Wins Hearts: దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన ఆటతోనే కాదు.. తన మంచి మనసుతోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మ్యాచ్ సమయంలో హార్దిక్ కొట్టిన భారీ సిక్సుల్లో ఒకటి కెమెరామెన్ను తాకింది. దీంతో మ్యాచ్ చివరి బంతి పూర్తవగానే హార్దిక్ వెంటనే అక్కడికి వెళ్లి కెమెరామెన్ పరిస్థితి తెలుసుకున్నాడు. ఓదార్చుతూ ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. అంతేకాదు, బంతి తగిలిన ఎడమ భుజంపై ఐస్ ప్యాక్ పెట్టి స్వయంగా సహాయం చేశాడు. హార్దిక్ బలంగా కొట్టడంతో…
South Africa head coach Shukri Conrad: దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్ భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 సిరీస్లో రెండు జట్ల మధ్య తేడా చూపించింది హార్దిక్ పాండ్యానేనని ఆయన వ్యాఖ్యానించాడు. సిరీస్లో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్లో 25 బంతుల్లో 63 పరుగులతో అద్భుతంగా ఆడిన హార్దిక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆ మ్యాచ్లో హార్దిక్ కీలకమైన డీవాల్డ్ బ్రేవిస్ వికెట్ను కూడా పడగొట్టాడు. మూడు ఓవర్లలో 1 వికెట్…
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట (మ) వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం, భవానిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఈ ఇద్దరికి వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులు…
India vs Pakistan: అండర్-19 ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ ఫైనల్కు చేరింది. దుబాయ్లోని ది సెవెన్స్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై పాకిస్థాన్ విజయం సాధించింది. 122 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ తేలికగా చేధించింది. ఈ విజయంతో ఫైనల్లో భారత్తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ను ఇరు జట్లకు 27 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పాకిస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో…