Piyush Goyal: “టెన్షన్ వద్దు గురూ”.. ఇంధన సరఫరాపై కేంద్రం పక్కా ప్లాన్ రెడీ.. కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రపంచం ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. భారత్లోనూ ఇంధన కొరత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సామాన్యూలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సామాన్యులకు భారోసా ఇచ్చారు. తమిళనాడలోని తిరుచిరాపల్లిలో కేంద్ర మంత్రి మంగళవారం మాట్లాడారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ మిడిల్ ఈస్ట్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆయా శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాలేదన్నారు. క్షేత్రస్థాయిలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అవసర వస్తువుల చట్టాన్ని’ (Essential Commodities Act) ప్రయోగించిందని చెప్పారు.
READ MORE: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్సింగ్కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
ఇక.. పెట్రోలియం శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ వద్ద ఉన్న హైడ్రోకార్బన్ నిల్వలను ఎల్పీజీ (LPG) తయారీకి మళ్లించాలని సూచించింది. దీనివల్ల వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సామాన్యూలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర చర్యలు తీసుకుంటోంది. గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్, వాహనాలకు వాడే సీఎన్జీ (CNG) సరఫరాలో 100 శాతం కోత లేకుండా అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కావాల్సిన అన్ని చర్యలను చేపడుతోంది. మిగిలిన రంగాలకు సంబంధించి గత ఆరు నెలల సగటు వినియోగాన్ని బట్టి సరఫరాలో కొంత మార్పులు చేశారు. టీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర తయారీ రంగాలకు 80 శాతం మేర గ్యాస్ సరఫరా కానుంది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు కూడా 80 శాతం సరఫరాను పరిమితం చేశారు. వ్యవసాయానికి సంబంధించి కూలా ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తోంది. ఇప్పటికే ఎరువుల తయారీకి కావాల్సిన గ్యాస్ను ఎరువుల కర్మాగారాలకు 70 శాతం కేటాయింపులు జరిగాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న రవాణా సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను సైతం అన్వేషిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: కొడంగల్లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!