Piyush Goyal: “టెన్షన్ వద్దు గురూ”.. ఇంధన సరఫరాపై కేంద్రం పక్కా ప్లాన్ రెడీ.. కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రపంచం ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. భారత్లోనూ ఇంధన కొరత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సామాన్యూలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సామాన్యులకు భారోసా ఇచ్చారు. తమిళనాడలోని తిరుచిరాపల్లిలో కేంద్ర మంత్రి మంగళవారం మాట్లాడారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ మిడిల్ ఈస్ట్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆయా శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాలేదన్నారు. క్షేత్రస్థాయిలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అవసర వస్తువుల చట్టాన్ని’ (Essential Commodities Act) ప్రయోగించిందని చెప్పారు.
READ MORE: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్సింగ్కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక.. పెట్రోలియం శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ వద్ద ఉన్న హైడ్రోకార్బన్ నిల్వలను ఎల్పీజీ (LPG) తయారీకి మళ్లించాలని సూచించింది. దీనివల్ల వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సామాన్యూలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర చర్యలు తీసుకుంటోంది. గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్, వాహనాలకు వాడే సీఎన్జీ (CNG) సరఫరాలో 100 శాతం కోత లేకుండా అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కావాల్సిన అన్ని చర్యలను చేపడుతోంది. మిగిలిన రంగాలకు సంబంధించి గత ఆరు నెలల సగటు వినియోగాన్ని బట్టి సరఫరాలో కొంత మార్పులు చేశారు. టీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర తయారీ రంగాలకు 80 శాతం మేర గ్యాస్ సరఫరా కానుంది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు కూడా 80 శాతం సరఫరాను పరిమితం చేశారు. వ్యవసాయానికి సంబంధించి కూలా ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తోంది. ఇప్పటికే ఎరువుల తయారీకి కావాల్సిన గ్యాస్ను ఎరువుల కర్మాగారాలకు 70 శాతం కేటాయింపులు జరిగాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న రవాణా సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను సైతం అన్వేషిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!