Piyush Goyal: “టెన్షన్ వద్దు గురూ”.. ఇంధన సరఫరాపై కేంద్రం పక్కా ప్లాన్ రెడీ.. కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రపంచం ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. భారత్లోనూ ఇంధన కొరత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సామాన్యూలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సామాన్యులకు భారోసా ఇచ్చారు. తమిళనాడలోని తిరుచిరాపల్లిలో కేంద్ర మంత్రి మంగళవారం మాట్లాడారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ మిడిల్ ఈస్ట్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆయా శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాలేదన్నారు. క్షేత్రస్థాయిలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అవసర వస్తువుల చట్టాన్ని’ (Essential Commodities Act) ప్రయోగించిందని చెప్పారు.
READ MORE: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్సింగ్కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
Also Read
ఇక.. పెట్రోలియం శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ వద్ద ఉన్న హైడ్రోకార్బన్ నిల్వలను ఎల్పీజీ (LPG) తయారీకి మళ్లించాలని సూచించింది. దీనివల్ల వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సామాన్యూలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర చర్యలు తీసుకుంటోంది. గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్, వాహనాలకు వాడే సీఎన్జీ (CNG) సరఫరాలో 100 శాతం కోత లేకుండా అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కావాల్సిన అన్ని చర్యలను చేపడుతోంది. మిగిలిన రంగాలకు సంబంధించి గత ఆరు నెలల సగటు వినియోగాన్ని బట్టి సరఫరాలో కొంత మార్పులు చేశారు. టీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర తయారీ రంగాలకు 80 శాతం మేర గ్యాస్ సరఫరా కానుంది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు కూడా 80 శాతం సరఫరాను పరిమితం చేశారు. వ్యవసాయానికి సంబంధించి కూలా ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తోంది. ఇప్పటికే ఎరువుల తయారీకి కావాల్సిన గ్యాస్ను ఎరువుల కర్మాగారాలకు 70 శాతం కేటాయింపులు జరిగాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న రవాణా సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను సైతం అన్వేషిస్తోంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!