Piyush Goyal: “టెన్షన్ వద్దు గురూ”.. ఇంధన సరఫరాపై కేంద్రం పక్కా ప్లాన్ రెడీ.. కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Piyush Goyal: మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రపంచం ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. భారత్లోనూ ఇంధన కొరత ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సామాన్యూలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ సామాన్యులకు భారోసా ఇచ్చారు. తమిళనాడలోని తిరుచిరాపల్లిలో కేంద్ర మంత్రి మంగళవారం మాట్లాడారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్ మిడిల్ ఈస్ట్ పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని.. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరా గొలుసుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆయా శాఖలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాలేదన్నారు. క్షేత్రస్థాయిలోనూ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంధన మార్కెట్ను స్థిరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అవసర వస్తువుల చట్టాన్ని’ (Essential Commodities Act) ప్రయోగించిందని చెప్పారు.
READ MORE: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్సింగ్కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక.. పెట్రోలియం శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. రిఫైనరీలు, పెట్రోకెమికల్ యూనిట్లు తమ వద్ద ఉన్న హైడ్రోకార్బన్ నిల్వలను ఎల్పీజీ (LPG) తయారీకి మళ్లించాలని సూచించింది. దీనివల్ల వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా సామాన్యూలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర చర్యలు తీసుకుంటోంది. గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్, వాహనాలకు వాడే సీఎన్జీ (CNG) సరఫరాలో 100 శాతం కోత లేకుండా అందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి కావాల్సిన అన్ని చర్యలను చేపడుతోంది. మిగిలిన రంగాలకు సంబంధించి గత ఆరు నెలల సగటు వినియోగాన్ని బట్టి సరఫరాలో కొంత మార్పులు చేశారు. టీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర తయారీ రంగాలకు 80 శాతం మేర గ్యాస్ సరఫరా కానుంది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు కూడా 80 శాతం సరఫరాను పరిమితం చేశారు. వ్యవసాయానికి సంబంధించి కూలా ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూస్తోంది. ఇప్పటికే ఎరువుల తయారీకి కావాల్సిన గ్యాస్ను ఎరువుల కర్మాగారాలకు 70 శాతం కేటాయింపులు జరిగాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న రవాణా సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను సైతం అన్వేషిస్తోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!