అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై టారిఫ్ బాంబు పేల్చారు. బుధవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన 25% సుంకాలకు మరో 25% యాడ్ చేశారు. 50% సుంకాలు పెంచుతూ.. కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. భారత్పై మొత్తం 50% సుంకాన్ని అమెరికా ప్రకటించింది.
మైనర్పై అత్యాచారం కేసులో ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్పై స్టే విధించాలని యష్ రాజస్థాన్ హైకోర్టును సంప్రదించాడు. విచారణ జరిపిన కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో పాటు, ఆగస్టు 22న కేసు డైరీని సమర్పించాలని ప్రాసిక్యూషన్ను కోర్టు కోరింది. యష్ దయాల్ క్రిమినల్ పిటిషన్పై ప్రాథమిక విచారణను విచారిస్తూ జస్టిస్ సుదేష్ బన్సాల్తో కూడిన సింగిల్ బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు మైనర్ కు సంబంధించినదని కోర్టు పేర్కొంది. ఇలాంటి…
Maharashtra Suicide: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాలోని పరాస్ గ్రామంలో ఒక యువకుడు తన అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే (30) గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు.. ఆ యువకుడు ఓ వీడియో రికార్డ్ చేసి తన సోదరుడికి పంపాడు. అందులో తన భార్య, బావమరిది, అత్తమామలు తనను కొట్టి, రూ.3 లక్షల అప్పు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించాడు.
India’s SuperGaming Raises: భారతీయ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ సూపర్గేమింగ్ తాజా రౌండ్ నిధులలో US $15 మిలియన్లను సేకరించింది. ఈ మొత్తాన్ని భారత కరెన్సీలోకి మారుస్తే, రూ.132 కోట్లు అవుతుంది. ఈ కంపెనీ మాస్క్గన్, ఇండస్ బాటిల్ రాయల్ వంటి భారతీయ షూటింగ్ గేమ్లను తయారు చేస్తుంది. రౌండ్ నిధులు అంటే.. సంస్థ లేదా స్టార్టప్ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించే ప్రక్రియ.
Jaish-e-Mohammed: పాకిస్థాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. పహల్గామ్ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్ ఈ ప్రధాన కార్యాలయాన్ని మరోసారి పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ దీని కోసం ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించాడు. విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్థాన్లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ కి 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ చాలా కాలంగా…
NTV Podcast Promo: శ్రీను వైట్ల.. ఒకప్పుడు ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమా వచ్చిందంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకం తెలుగు ప్రేక్షకుల్లో ఉండేది. కానీ ‘ఆగడు’ తర్వాత ఆయన జాతకం అడ్డం తిరిగింది. ఈ సినిమా అనంతరం వచ్చిన మూవీస్ అనుకున్న రీతిలో ఆడలేదు. అయితే.. శ్రీను వైట్లు తాజాగా పాడ్కాస్ట్విత్ ఎన్టీవీ(ntvPodcastShow)లో పాల్గొన్నారు.
భారత్పై సుంకాల పెంపు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వరాన్ని మరింత పెంచారు. రానున్న 24 గంటల్లో భారత్పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుంకాల పెంపు అంశంపై తాజాగా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాలు మన ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపవని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ షరతులు వర్తిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం…
హరీష్ మాటలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకనభావం.. చట్టసభలు, న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారధ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదన్నారు.
రెండో భార్య కూతురు...!! వరుసకు కూతురవుతుందన్న సోయి లేదు. మైనర్ అమ్మాయి అనే జాలి లేదు. విచక్షణ మరిచి.. కామాందుడిలా ప్రవర్తించాడు. స్టార్ హీరోలకు స్టెప్పులు నేర్పిన కొరియోగ్రాఫరే ఐనా... తన నీచపు బుద్ధితో పరువు బజారుకీడ్చుకున్నాడు. కూతురిని వేధించడంతో తట్టుకోలేకపోయిన తల్లి.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Hyderabad: హైదరాబాద్ సిటీలో నిఘా ఎక్కువైందని.. శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. డ్రగ్ పార్టీల కోసం ఫాం హౌజ్లు, రిసార్ట్లు అద్దెకు తీసుకుంటున్నారు. బర్త్ డే.. గెట్ టుగెదర్.. వీకెండ్ ఔటింగ్... అంటూ పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా 10 రోజుల వ్యవధిలోనే 2 డ్రగ్ పార్టీలపై దాడులు చేశారు పోలీసులు. యువకుల వద్ద పెద్ద ఎత్తున్న డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గబ్బు పట్టిస్తున్న పబ్బులపైనే ఫోకస్ పెట్టిన పోలీసులు..