Jaish-e-Mohammed: మళ్లీ పుంజుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammed: పాకిస్థాలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ చురుగ్గా మారుతోంది. పహల్గామ్ దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్థాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా జైషే మహ్మద్ ఈ ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ దీని కోసం ఆన్లైన్ ప్రచారాన్ని ప్రారంభించాడు. విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. పాకిస్థాన్లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ కి 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్ చాలా కాలంగా ఉగ్రవాద సంస్థ సైద్ధాంతిక, శిక్షణ కేంద్రంగా ఉంది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు సీఎం దిశానిర్దేశం.. ఇక నుంచి దూకుడు పెంచాలి..!
Also Read
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
అయితే.. సోషల్ మీడియాలో ఉర్దూలో షేర్ చేయబడిన ఒక పోస్ట్ ప్రకారం.. జెఎం తన ప్రధాన కార్యాలయం – జామియా మసీదు సుభాన్ అల్లాహ్ పునరుద్ధరణ కోసం తెలివిగా విరాళాలను కోరింది. “అందరూ ఐక్యంగా, కలిసి పనిచేయాలి. అలాగే, డబ్బు వసూలు చేసేటప్పుడు, ఎవరు ఎంత విరాళం ఇచ్చారో ఎవరికీ వెల్లడించకూడదని గుర్తుంచుకోండి. ఈ ప్రచారం ద్వారా భూమిపై కొన్ని ప్రాంతాలు స్వర్గంలా మారుతాయి. అమరవీరుల మసీదులకు వైభవం తిరిగి వస్తుంది. జిహాద్ మార్గాన్ని అనుసరించడానికి ఆసక్తి ఉన్న వాళ్లకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.” అని పేర్కొన్నారు.
READ MORE: Singireddy Niranjan Reddy : కమిషన్లు కోర్టులు కావు.. నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత భద్రతా దళాలు తమ బలాన్ని ప్రదర్శించి ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో జైషే మహ్మద్ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. సైన్యం బహవల్పూర్లోని జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం అయిన సుభాన్ అల్లాహ్ మసీదును భారత సైన్యం కూల్చివేసింది. ఈ వైమానిక దాడిలో ఉగ్రవాదులకు శిక్షణ అందించే స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఆపరేషన్లో మసూద్ అజార్ కుటుంబంతో సహా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
-
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
-
Imad Wasim: మాజీ భార్య సంచలన ఆరోపణలు.. మౌనం వీడిన పాక్ క్రికెటర్ ఇమాద్ వసీం
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!