Yash Dayal: అత్యాచారం కేసులో ఆర్సీబీ ప్లేయర్కు భారీ ఎదురుదెబ్బ.. అరెస్ట్ తప్పదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Dayal Case: మైనర్పై అత్యాచారం కేసులో ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యష్ దయాళ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్పై స్టే విధించాలని యష్ రాజస్థాన్ హైకోర్టును సంప్రదించాడు. విచారణ జరిపిన కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో పాటు, ఆగస్టు 22న కేసు డైరీని సమర్పించాలని ప్రాసిక్యూషన్ను కోర్టు కోరింది. యష్ దయాల్ క్రిమినల్ పిటిషన్పై ప్రాథమిక విచారణను విచారిస్తూ జస్టిస్ సుదేష్ బన్సాల్తో కూడిన సింగిల్ బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు మైనర్ కు సంబంధించినదని కోర్టు పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. ఆర్సీబీ ప్లేయర్ యష్ దయాల్ కేసులో పోలీసుల చర్యలను ఆపలేమని తేల్చి చెప్పింది. కాగా.. హైకోర్టులో విచారణ సందర్భంగా, యష్ దయాళ్ న్యాయవాది ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో నమోదైన ఇలాంటి కేసును ప్రస్తావించారు. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అరెస్టును నిలిపివేసిందని వివరించారు. అయితే, ఈ కేసు మైనర్కు సంబంధించినదని చెబుతూ కోర్టు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 22కు వాయిదా వేసింది. ఈ తీర్పు అనంతరం యష్ అరెస్ట్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.
READ MORE: RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
అసలు ఏంటి ఈ కేసు..?
క్రికెట్లో కెరీర్ చూపిస్తానని నమ్మించి రెండేళ్లుగా యష్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని రాజస్థాన్కు చెందిన ఓ యువతి గతంలో ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజస్థాన్లోని సంగనేర్ పోలీస్ స్టేషన్లో యష్పై పోక్సో కేసు నమోదైంది. దీంతో యశ్ దయాల్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జైపుర్లో తొలిసారి తాను యష్ను కలిసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించింది. క్రికెట్ కెరీర్లో సలహాలు ఇస్తానంటూ సీతాపురలోని ఓ హోటల్కు తనను పిలిచి అక్కడ లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఆ తర్వాత నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్ల పాటు తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. లైంగిక వేధింపులు మొదలైనప్పుడు బాధితురాలి ఏజ్ 17 ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద యష్ సంగనేర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతకు ముందు.. ఉత్తరప్రదేశ్ని గాజియాబాద్కు చెందిన ఓ యువతి యష్ దయాళ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. గత ఐదేళ్లుగా తనతో రిలేషన్ షిప్లో ఉన్నాడని చెప్పింది. కాబోయే కోడలు అంటూ ఇంట్లో పరిచయం చేసి ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశాడని చెప్పింది. కొంతకాలం తర్వాత యష్కు ఇతర అమ్మాయిలతో సంబంధాలున్నాయని తెలిసిందని వెల్లడించింది. ఈ క్రమంలో గాజియాబాద్లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యష్పై పోలీసులు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. యష్ అలహబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం యశ్ దయాళ్ను అరెస్టు చేయకుండా స్టే విధించింది.
READ MORE: Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!