Gachibowli: హైదరాబాద్లో నిన్న కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు గచ్చిబౌలిలో పిడుగు పడింది. ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై భారీ శబ్దంతో పిడింది. భారీ శబ్దం రావడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. పిడుగు ధాటికి తాటి చెట్టుకు మంటలంటుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫొటో చూశారా..? అచ్చం పోలీసు కానిస్టేబుల్ నిల్చొన్నట్టు పక్కనే పోలీసు కారు ఉన్నట్లు కనిపిస్తుంది కదూ.. నిజంగా అక్కడ కానిస్టేబుల్ నిలబడ్డారని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. అక్కడ ఉన్నది నిజమైన పోలీసు కాదు.. అది నిజమై పోలీస్ కారూ కాదు.. ఇది ఓ కటౌట్ మాత్రమే.. జిల్లాలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి , మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా జాతీయ రహదారి - 44 పై…
ప్రస్తుతం ఏ బిజినేస్ అయిన యువత ఇష్టాలమీద, ఉద్యోగుల అవసరాల మీద ఆధారపడి ఉంటున్నాయి. మీకు తెలుసా ఇప్పుడు మార్కెట్లో నయా లోన్ ట్రెండింగ్లో ఉందని.. అసలు ఏంటా నయా లోన్, దానిపై ఒక లుక్ ఏద్దాం.. మనం తరచుగా హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్ గురించి వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు మార్కెట్లో నయా ట్రెండ్ నడుస్తుంది.
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు..
సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు.
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించాడంటూ గజ్వేల్ పీఎస్లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్కుమార్ ఫిర్యాదు చేశారు.
New Film: కథానాయకుడు నాని నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా కోర్ట్. తెలుగు దర్శకులు అరుదుగా స్పృశించే కోర్ట్ రూమ్ డ్రామా కథతో ఈ చిత్రం రూపొందించగా.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే.. ఈ సినిమాలో నటించిన హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా.. రాజస్థాన్లోని బికనీర్లో రెండు ప్రధాన పరిశ్రమలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కార్పెట్, ఉన్ని, నమ్కీన్ తోపాటు స్వీట్స్ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యాపారుల ఆందోళనను పెంచింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని వైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. భారతదేశంపై ఆయన అభిప్రాయంతో సొంత దేశస్థులే అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవల భారత్పై 25% సుంకం విధించిన భారతదేశాన్ని 'డెడ్ ఎకానమి' అంటూ ఎగతాళి చేశారు. ఇది అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకు పెద్ద తప్పుగా నిపుణులు పరిగణిస్తున్నారు. మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ టెస్ట్బెడ్ అధ్యక్షుడు కిర్క్ లుబిమోవ్..
Hyderabadi Chicken Dum Biryani Recipe హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన నాన్వెజ్ ప్రియులు హైదరాబాద్ వస్తే బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అంతటి ఆదరణ కలిగిన హైదరాబాద్ ఇప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ రేంజ్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి..