Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Suicide: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాలోని పరాస్ గ్రామంలో ఒక యువకుడు తన అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే (30) గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు.. ఆ యువకుడు ఓ వీడియో రికార్డ్ చేసి తన సోదరుడికి పంపాడు. అందులో తన భార్య, బావమరిది, అత్తమామలు తనను కొట్టి, రూ.3 లక్షల అప్పు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించాడు.
READ MORE: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం పరాస్ రైల్వే స్టేషన్ సమీపంలో సంఘ్పాల్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి మొబైల్, ఒక కీని కనుగొన్నారు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో బాధిత కుటుంబీకులు ఓ వీడియోను పోలీసులకు అందజేశారు. ఈ వీడియో 58 సెకన్ల నిడివి ఉంది. అందులో సంఘపాల్ “దాదా(అన్నయ్య), నేను నా భార్యతో గొడవ పడ్డాను. ఆమె బంధువు, సోదరుడు, వారి స్నేహితులు నన్ను కొట్టారు. ఎనిమిది రోజుల క్రితం.. మూడు లక్షల రూపాయల అప్పు తీసుకోవాలని నన్ను బలవంతం చేశారు. వారు నన్ను బ్రతకనివ్వడం లేదు. బెదిరిస్తున్నారు. నా భార్య, ఆమె సోదరుడు(బావమరిది), అత్తామామలు, సోదరి(మరదలు), బావమరిది స్నేహితులు సహా ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను చంపేస్తారు. వారి కంటే ముందు నేనే చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత వారిని వదిలి పెట్టకండి. ఈ వీడియోను పోలీసులకు చూపించి వాళ్లపై కేసు నమోదు చేయించండి.” అని సంఘ్పాల్ తన చివరి వీడియోలో తన బాధను వ్యక్త పరిచాడు. అమ్మానాన్నలకు వీడ్కోలు తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Dhurandhar 2: ‘ధురంధర్ 2’ OTT రిలీజ్పై ట్విస్ట్..
-
NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
ట్రెండింగ్
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!