Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Suicide: మహారాష్ట్రలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అకోలా జిల్లాలోని పరాస్ గ్రామంలో ఒక యువకుడు తన అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే (30) గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకునే ముందు.. ఆ యువకుడు ఓ వీడియో రికార్డ్ చేసి తన సోదరుడికి పంపాడు. అందులో తన భార్య, బావమరిది, అత్తమామలు తనను కొట్టి, రూ.3 లక్షల అప్పు చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపించాడు.
READ MORE: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!
Also Read
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం పరాస్ రైల్వే స్టేషన్ సమీపంలో సంఘ్పాల్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలం నుంచి మొబైల్, ఒక కీని కనుగొన్నారు. మృతుడిని సంఘపాల్ సిద్ధార్థ్ ఖండారే గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో బాధిత కుటుంబీకులు ఓ వీడియోను పోలీసులకు అందజేశారు. ఈ వీడియో 58 సెకన్ల నిడివి ఉంది. అందులో సంఘపాల్ “దాదా(అన్నయ్య), నేను నా భార్యతో గొడవ పడ్డాను. ఆమె బంధువు, సోదరుడు, వారి స్నేహితులు నన్ను కొట్టారు. ఎనిమిది రోజుల క్రితం.. మూడు లక్షల రూపాయల అప్పు తీసుకోవాలని నన్ను బలవంతం చేశారు. వారు నన్ను బ్రతకనివ్వడం లేదు. బెదిరిస్తున్నారు. నా భార్య, ఆమె సోదరుడు(బావమరిది), అత్తామామలు, సోదరి(మరదలు), బావమరిది స్నేహితులు సహా ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను చంపేస్తారు. వారి కంటే ముందు నేనే చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత వారిని వదిలి పెట్టకండి. ఈ వీడియోను పోలీసులకు చూపించి వాళ్లపై కేసు నమోదు చేయించండి.” అని సంఘ్పాల్ తన చివరి వీడియోలో తన బాధను వ్యక్త పరిచాడు. అమ్మానాన్నలకు వీడ్కోలు తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!