Congress MLA KC Veerendra Arrested: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఒక కోటి కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నారు.
ఐదు సంవత్సరాల క్రితం భారతదేశంలో నిషేధించబడిన చైనా షార్ట్-వీడియో యాప్ టిక్టాక్ మరోసారి వార్తల్లో నిలిచింది. కొంతమంది వినియోగదారులు టిక్టాక్ వెబ్సైట్ను యాక్సెస్ చేయగలిగామని చెబుతున్నారు. దీంతో యాప్ తిరిగి భారత్లోకి అడుగుపెడుతుందని ఊహాగానాలు సోషల్ మీడియాలో తీవ్రమయ్యాయి. అయితే, టిక్టాక్ యాప్ ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో లేదు. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ భారత్కి తిరిగి రావడం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
MP: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి మాత్రం ఏదో తక్కువైంది. ఏం తక్కువై ఉంటుంది? అని ఆలోచిస్తు్న్నారా? ఆయనకు లడ్డూ ఇవ్వలేదు. అదే పెద్ద లోటుగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తం ఏకంగా సీఎంకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో గ్రామ పంచాయతీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
UP: పనిమనిషిని ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. వారి వ్యక్తిత్వం, గుణగణాలను చెక్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్లని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్లో పనిమనిషి చేసిన ఓ అసహ్యకరమైన చర్య బయటకు వచ్చింది. బిజ్నోర్ జిల్లాలోని నాగినా పట్టణంలో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా ఒక వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి చేసిన సిగ్గుచేటు చర్య కెమెరాలో రికార్డైంది. ఆ మహిళ వంటగదిలోని గ్లాసులో మూత్ర విసర్జన చేసి, కడిగిన పాత్రలపై చల్లింది. ఈ సంఘటనకు…
MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురం జిల్లాకు చెందిన ఆరిఫ్ ఖాన్ చిష్తి తన అనే ముస్లిం యువకుడు కుల, మతాలను పక్కనపెట్టాడు. తన కిడ్నీని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ మహారాజ్కు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆరిఫ్ ఖాన్ ప్రేమానంద్ మహారాజ్, జిల్లా యంత్రాంగానికి ఒక లేఖ పంపారు. జాతీయ ఐక్యత కోసం ప్రబోధించే ప్రేమానంద్ దీర్ఘాయుష్షుతో జీవించాలని, తద్వారా దేశ సమగ్రతను కాపాడటంలో ప్రత్యేక కృషి చేయాలని కోరాడు.
Big Nude Boat: ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్నింటి గురించి మనకు తెలియదు. వాటిలో ఒకటి నేకెడ్ పడవ ప్రయాణం ఒకటి. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇలాంటి ఓ పడవ ఉంది. ప్రస్తుతం ఈ ఓడ గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇది అన్ని షిప్ల్ల కాదు..
Jammu Kashmir govt employees sacked: జమ్మూ కశ్మీర్ కి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఈ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. వీరు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల కోసం పనిచేస్తున్నారని దర్యాప్తులో తేలింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి) ని ఉటంకిస్తూ.. లెఫ్ట్నెంట్ గవర్నర్ ఉద్యోగలను తొగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ నిందితులను కుప్వారాలోని కర్నాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఖుర్షీద్…
DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివకుమార్ రాష్ట్ర అసెంబ్లీలో అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటపై చర్చ సందర్భంగా డీకే శివకుమార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రార్థనలోని కొన్ని వ్యాక్యాలను పాడారు.
దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించే ప్రయత్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జీఎస్టీ సంస్కరణలు ప్రకటించారు. 2025 దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు అమలు కావొచ్చని మోడీ సూచనప్రాయంగా తెలిపారు.
Manda Krishna Madiga: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పింఛన్దారులను మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలు, ఆసరా పింఛన్ రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని.. 20 నెలలు దాటినా అమలు చేయట్లేదని విమర్శించారు.