MP: స్వాతంత్ర్య దినోత్సవం వేడుక.. లడ్డూ ఇవ్వనందుకు ఏకంగా సీఎంకు ఫిర్యాదు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి మాత్రం ఏదో తక్కువైంది. ఏం తక్కువై ఉంటుంది? అని ఆలోచిస్తు్న్నారా? ఆయనకు లడ్డూ ఇవ్వలేదు. అదే పెద్ద లోటుగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తం ఏకంగా సీఎంకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో గ్రామ పంచాయతీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
READ MORE: Schocking : టీవీ సీరియల్ గొడవ.. మహబూబాబాద్లో భార్య బిడ్డతో ఆత్మహత్యాయత్నం
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాకు చెందిన సీఎం హెల్ప్లైన్పై ఒక వింత ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు లడ్డూలు అందకపోవడంతో కోపోద్రిక్తుడైన గ్రామస్థుడు సీఎం హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి.. ఆగస్టు 15న రౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నోధా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం తర్వాత, పంచాయతీ తరఫున లడ్డూలను పంపిణీ చేశారు. కానీ జనాల సంఖ్య పెరిగింది. లడ్డూలు తగ్గాయి. దీంతో రెండు లడ్డూలకు బదులుగా ఒక లడ్డూను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
READ MORE: Suryapet : బైక్ పై వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు దుండగలు
అలాగే ఒక లడ్డూను గ్రామస్తుడు కమలేష్ బాబాకు కూడా ఇచ్చారు. కానీ కమలేష్ లడ్డూలు పంపిణీ చేసే వ్యక్తి నుంచి రెండు లడ్డూలు డిమాండ్ చేశాడు. తక్కువ లడ్డూలు ఉన్నాయని చెప్పి మరో లడ్డూ ఇవ్వడానికి నిరాకరించాడు. కమలేష్ కు ఇది నచ్చలేదు. ఈ అంశంపై కమలేష్ ముఖ్యమంత్రి హెల్ప్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. సీఎం హెల్ప్ లైన్ నుంచి ఫిర్యాదు పంచాయతీ కార్యదర్శి రవీంద్ర శ్రీవాస్తవకు చేరింది. కమలేష్ కు మరో లడ్డూ ఇచ్చేందుకు కార్యదర్శి సిద్ధమయ్యాడు. కానీ.. ఈ ఫిర్యాదు కేవలం లడ్డూల గురించే కాదు, పంచాయతీలో జరుగుతున్న అక్రమాల గురించి కూడా అని ఫిర్యాదుదారుడు కమలేష్ బాబా చెబుతున్నారు. పంచాయతీలో గ్రామసభ జరిగినప్పుడల్లా ఎవరినీ ఆహ్వానించరని తెలిపాడు కమలేష్. పంచాయతీలో అవినీతి జరుగుతుందని, అందువల్ల దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆగస్టు 15న లడ్డూలు అంశంలోనూ అవినీతి జరిగిందంటున్నాడు.
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్కు కౌంట్డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!