Hyderabad Tragedy: మా ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు.. నిజానికి పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు.
Premanand Maharaj: ప్రేమానంద్ మహరాజ్ ఆరోగ్యంగా ఉండాలని మదీనాలో ముస్లిం వ్యక్తి ప్రార్థించాడు. బృందావనంలో నివసించే సాధువు త్వరగా కోలుకోవాలని ఇస్లాం మతంలోని అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటైన మదీనాలో ప్రార్థించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రయాగ్రాజ్కు చెందిన సుఫియాన్ అలహాబాద్ అనే యువకుడు ఈ వీడియో రికార్డు చేశాడు. దీంతో ఈ వీడియో సర్వమత ఐక్యతకు చిహ్నంగా మారింది. సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. దాదాపు 1 నిమిషం 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సుఫియాన్…
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Muslim Population: భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇదే సమయంలో హిందూ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ విషయం ఊరకే చెప్పట్లేదు. ఇది లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయంలో ఈ విషయం వెల్లడైంది. ముస్లిం జనాభా పెరుగుదలకు కారణాలు అనేకం ఉండొచ్చు. ఈ పెరుగుదల మాత్రం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన మొదటి దేశంగా ఇండోనేషియా ఉంది. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ రెండో స్థానంలో…
Cough Syrup Tragedy: కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ వల్ల అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చింద్వారాలో 24 మంది పిల్లల మరణాల కేసులో ఈ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అక్టోబర్ 8న, కోర్టు డాక్టర్ ప్రవీణ్ సోనికి బెయిల్ నిరాకరించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వడాన్ని నిషేధించిన 2023 కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను వైద్యుడు పాటించలేదని కోర్టు పేర్కొంది. కోల్డ్రిఫ్ సిరప్ను పిల్లల ఔషధంగా సూచించినందుకు కంపెనీ తనకు 10 శాతం…
E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
Liver Health: కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, నిర్విషీకరణతో సహా సుమారు 500 విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, కాలేయ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని చెబుతారు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.
Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో తాలిబన్లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్షీర్, కాబూల్లలో సంబరాలు మిన్నంటాయి.
Rajmata Vijaya Raje Scindia: భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యవస్థాపక సభ్యురాలు, జనసంఘ్ ప్రముఖ నాయకురాలు రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు నివాళులు అర్పించారు. సామాజిక సేవ పట్ల ఆమె అంకితభావం, భారతీయ సంస్కృతిపై ఆమెకున్న విశ్వాసం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.