MLA Raja singh: బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్య అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న […]
UP Encounters: ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం ఎన్కౌంటర్లకు చిరునామాగా మారుతోంది. పేరు మోసిన నేరస్థులను మట్టుపెట్టడంలో యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న "జీరో టాలరెన్స్" విధానం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఎనిమిదిన్నర సంవత్సరాలలో 15,726 ఎన్కౌంటర్లు చేశారు. 256 మంది పేరుమోసిన నేరస్థులను హతమార్చారు.
Afghanistan-Pakistan: తాలిబన్లు, పాకిస్థాన్ దళాల మధ్య మరోసారి భీకర పోరాటం జరుగుతోంది. ఆఫ్ఘస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న స్పిన్ బోల్డాక్లో రెండు సైన్యాలు తలబడుతున్నాయి. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాకిస్థాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Guntur Train Assault: గుంటూరు జిల్లా పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం జరిగింది. గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్రగంజ్ నుంచి చెర్లపల్లి వెలుతున్న ట్రెయిన్ మహిళా భోగిలోకి గుర్తుతెలియని వ్యక్తి ఎక్కాడు..
APJ Abdul Kalam: మిసైల్ మ్యాన్గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వెళ్లిపోయినా, ఆయన తాలూకు స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. శాస్త్రవేత్తగా మన దేశానికి అందించిన విజ్ఞానం అపారం. అందుకే ఆయనను భారతరత్న కూడా వరించింది. 2015లో జులై 27న ఆయన ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. ఈ రోజు ఆయన జయంతి. అబ్దుల్ కలా జీవితంలోని ఓ […]
Top Maoist Leader Venugopal: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్రవీస్ అధికారికంగా ప్రకటించనుంది. కాసేపట్లో గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.. మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాశారు.. 54 ఆయుధాలతో నిన్న గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ రావ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
Giorgia Meloni: ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియో మెలోని ధూమపానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్.. మెలోనిని ధూమపానం మానేయమని సలహా ఇచ్చారు. యూరోపియన్ మీడియా పొలిటికో ఈ విషయంపై నివేదించింది. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు మెలోని ఏ సిగరెట్ తాగుతుంది? అనే చర్చ జోరందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నెట్లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. […]
MCED Blood Test Detects Cancer Early: ప్రజలను రోజురోజుకు క్యాన్సర్ విస్పోటనం కలవరపెడుతోంది. ఈ మహమ్మారి ప్రజారోగ్యానికే గండంగా మారుతోంది. గడిచిన అయిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి రకరకాల క్యాన్సర్లు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్కు తెలిపిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో క్యాన్సర్ల కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9%, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి. […]
Secunderabad: ప్రేమ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. తనను ప్రేమించమంటూ వెంటపడి, వేధించి, చివరకు యువతి మృతికి కారణమైన వాలీబాల్ కోచ్ను ఎట్టకేలకు అరెస్టు చేశారు. యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే.. వాలీబాల్ కోచ్ పారిపోయాడు. పరారీలో ఉన్న కోచ్కు సంబంధించిన పక్కా సమాచారం రావడంతో రైళ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు అంబాజీ నాయక్. వాలీబాల్ కోచ్గా పని చేస్తున్నాడు. ఇతని ప్రేమ వేధింపుల కారణంగా..…
QNET Investment Scam: వివాదాస్పద QNET మరో ప్రాణం బలి తీసుకుంది. ఈ నెట్వర్క్తో ముడిపడి ఉన్న ఆన్లైన్ పెట్టుబడి స్కామ్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న.. సిద్దిపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. భారతీయ న్యాయ సంహిత BNS, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం, 1978లోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం వెల్లూరుకి చెందిన…