E20 Petrol: E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
READ MORE: Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
- BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
సర్వే ఏం చెబుతోంది?
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 2022లో లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు చెందిన పది మంది యజమానులలో ఎనిమిది మంది ఈ పెట్రోల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2025 నాటికి తమ వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గిందని నివేదించారు. దేశవ్యాప్తంగా 323 జిల్లాల నుంచి 36,000 మంది వాహన యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 69% మంది పురుషులు, 31% మంది మహిళలు. ఇందులో దాదాపు సగం మంది టైర్-1 నగరాలకు చెందినవారు. మిగిలిన వారు టైర్-2, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
2025 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మైలేజ్, వాహనం పనితీరుకు సంబంధించిన ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఈ సమస్య ముఖ్యంగా 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలలో మొదలైంది. ప్రభుత్వం ఈ ఇంధనం అన్ని వాహనాలకు సురక్షితమైనదని నిరంతరం ప్రకటిస్తున్నప్పటికీ.. E20 పెట్రోల్ను ఉపయోగించిన తర్వాత తమ వాహనాల మైలేజీ తగ్గిందని వాహన యజమానులు నివేదిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు తమ కార్లు ఉదయం స్టార్ట్ కావడం లేదని, మరికొందరు ఇంజిన్ పాడై మరమ్మతుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నైలోని ఒక లగ్జరీ కారు యజమాని E20 కారణంగా తన కారు ఇంజిన్ విఫలమైందని, దీని మరమ్మతుల కోసం దాదాపు ₹4 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి అనేక నగరాల్లోని మెకానిక్లు ఇంధన సంబంధిత ఫిర్యాదులు దాదాపు 40% పెరిగాయని చెబుతున్నారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
అయితే.. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి (బ్లెండెడ్ పెట్రోల్) వాహనాల్లో వినియోగించడంతో ఇంధన సామర్థ్యం 2-5 శాతం మేర తగ్గిపోవచ్చని వాహన పరిశ్రమ నిపుణులు గతంలో అంచనా వేశారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొద్దిగా తేడాలు ఉండొచ్చని భావించారు. ఇ20 ఇంధనం వాడకంతో వాహనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తుండగా, వాహన రంగంలోని ప్రధాన కంపెనీల్లో పని చేస్తున్న ఇంజినీర్లు కొంత మంది స్పందించారు. ఇ20 రకానికి చెందని పాత వాహనాల్లో ఈ పెట్రోల్ వాడకంతో దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు కోతకు గురవుతాయని వారు వెల్లడించారు. తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!