E20 Petrol: E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
READ MORE: Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
Also Read
- BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
సర్వే ఏం చెబుతోంది?
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 2022లో లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు చెందిన పది మంది యజమానులలో ఎనిమిది మంది ఈ పెట్రోల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2025 నాటికి తమ వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గిందని నివేదించారు. దేశవ్యాప్తంగా 323 జిల్లాల నుంచి 36,000 మంది వాహన యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 69% మంది పురుషులు, 31% మంది మహిళలు. ఇందులో దాదాపు సగం మంది టైర్-1 నగరాలకు చెందినవారు. మిగిలిన వారు టైర్-2, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
2025 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మైలేజ్, వాహనం పనితీరుకు సంబంధించిన ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఈ సమస్య ముఖ్యంగా 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలలో మొదలైంది. ప్రభుత్వం ఈ ఇంధనం అన్ని వాహనాలకు సురక్షితమైనదని నిరంతరం ప్రకటిస్తున్నప్పటికీ.. E20 పెట్రోల్ను ఉపయోగించిన తర్వాత తమ వాహనాల మైలేజీ తగ్గిందని వాహన యజమానులు నివేదిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు తమ కార్లు ఉదయం స్టార్ట్ కావడం లేదని, మరికొందరు ఇంజిన్ పాడై మరమ్మతుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నైలోని ఒక లగ్జరీ కారు యజమాని E20 కారణంగా తన కారు ఇంజిన్ విఫలమైందని, దీని మరమ్మతుల కోసం దాదాపు ₹4 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి అనేక నగరాల్లోని మెకానిక్లు ఇంధన సంబంధిత ఫిర్యాదులు దాదాపు 40% పెరిగాయని చెబుతున్నారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
అయితే.. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి (బ్లెండెడ్ పెట్రోల్) వాహనాల్లో వినియోగించడంతో ఇంధన సామర్థ్యం 2-5 శాతం మేర తగ్గిపోవచ్చని వాహన పరిశ్రమ నిపుణులు గతంలో అంచనా వేశారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొద్దిగా తేడాలు ఉండొచ్చని భావించారు. ఇ20 ఇంధనం వాడకంతో వాహనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తుండగా, వాహన రంగంలోని ప్రధాన కంపెనీల్లో పని చేస్తున్న ఇంజినీర్లు కొంత మంది స్పందించారు. ఇ20 రకానికి చెందని పాత వాహనాల్లో ఈ పెట్రోల్ వాడకంతో దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు కోతకు గురవుతాయని వారు వెల్లడించారు. తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.
తాజావార్తలు
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!