E20 Petrol: E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
READ MORE: Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
Also Read
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
సర్వే ఏం చెబుతోంది?
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 2022లో లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు చెందిన పది మంది యజమానులలో ఎనిమిది మంది ఈ పెట్రోల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2025 నాటికి తమ వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గిందని నివేదించారు. దేశవ్యాప్తంగా 323 జిల్లాల నుంచి 36,000 మంది వాహన యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 69% మంది పురుషులు, 31% మంది మహిళలు. ఇందులో దాదాపు సగం మంది టైర్-1 నగరాలకు చెందినవారు. మిగిలిన వారు టైర్-2, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
2025 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మైలేజ్, వాహనం పనితీరుకు సంబంధించిన ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఈ సమస్య ముఖ్యంగా 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలలో మొదలైంది. ప్రభుత్వం ఈ ఇంధనం అన్ని వాహనాలకు సురక్షితమైనదని నిరంతరం ప్రకటిస్తున్నప్పటికీ.. E20 పెట్రోల్ను ఉపయోగించిన తర్వాత తమ వాహనాల మైలేజీ తగ్గిందని వాహన యజమానులు నివేదిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు తమ కార్లు ఉదయం స్టార్ట్ కావడం లేదని, మరికొందరు ఇంజిన్ పాడై మరమ్మతుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నైలోని ఒక లగ్జరీ కారు యజమాని E20 కారణంగా తన కారు ఇంజిన్ విఫలమైందని, దీని మరమ్మతుల కోసం దాదాపు ₹4 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి అనేక నగరాల్లోని మెకానిక్లు ఇంధన సంబంధిత ఫిర్యాదులు దాదాపు 40% పెరిగాయని చెబుతున్నారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
అయితే.. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి (బ్లెండెడ్ పెట్రోల్) వాహనాల్లో వినియోగించడంతో ఇంధన సామర్థ్యం 2-5 శాతం మేర తగ్గిపోవచ్చని వాహన పరిశ్రమ నిపుణులు గతంలో అంచనా వేశారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొద్దిగా తేడాలు ఉండొచ్చని భావించారు. ఇ20 ఇంధనం వాడకంతో వాహనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తుండగా, వాహన రంగంలోని ప్రధాన కంపెనీల్లో పని చేస్తున్న ఇంజినీర్లు కొంత మంది స్పందించారు. ఇ20 రకానికి చెందని పాత వాహనాల్లో ఈ పెట్రోల్ వాడకంతో దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు కోతకు గురవుతాయని వారు వెల్లడించారు. తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!