E20 Petrol: E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
READ MORE: Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
Also Read
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
సర్వే ఏం చెబుతోంది?
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 2022లో లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు చెందిన పది మంది యజమానులలో ఎనిమిది మంది ఈ పెట్రోల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2025 నాటికి తమ వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గిందని నివేదించారు. దేశవ్యాప్తంగా 323 జిల్లాల నుంచి 36,000 మంది వాహన యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 69% మంది పురుషులు, 31% మంది మహిళలు. ఇందులో దాదాపు సగం మంది టైర్-1 నగరాలకు చెందినవారు. మిగిలిన వారు టైర్-2, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
2025 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మైలేజ్, వాహనం పనితీరుకు సంబంధించిన ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఈ సమస్య ముఖ్యంగా 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలలో మొదలైంది. ప్రభుత్వం ఈ ఇంధనం అన్ని వాహనాలకు సురక్షితమైనదని నిరంతరం ప్రకటిస్తున్నప్పటికీ.. E20 పెట్రోల్ను ఉపయోగించిన తర్వాత తమ వాహనాల మైలేజీ తగ్గిందని వాహన యజమానులు నివేదిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు తమ కార్లు ఉదయం స్టార్ట్ కావడం లేదని, మరికొందరు ఇంజిన్ పాడై మరమ్మతుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నైలోని ఒక లగ్జరీ కారు యజమాని E20 కారణంగా తన కారు ఇంజిన్ విఫలమైందని, దీని మరమ్మతుల కోసం దాదాపు ₹4 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి అనేక నగరాల్లోని మెకానిక్లు ఇంధన సంబంధిత ఫిర్యాదులు దాదాపు 40% పెరిగాయని చెబుతున్నారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
అయితే.. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి (బ్లెండెడ్ పెట్రోల్) వాహనాల్లో వినియోగించడంతో ఇంధన సామర్థ్యం 2-5 శాతం మేర తగ్గిపోవచ్చని వాహన పరిశ్రమ నిపుణులు గతంలో అంచనా వేశారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొద్దిగా తేడాలు ఉండొచ్చని భావించారు. ఇ20 ఇంధనం వాడకంతో వాహనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తుండగా, వాహన రంగంలోని ప్రధాన కంపెనీల్లో పని చేస్తున్న ఇంజినీర్లు కొంత మంది స్పందించారు. ఇ20 రకానికి చెందని పాత వాహనాల్లో ఈ పెట్రోల్ వాడకంతో దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు కోతకు గురవుతాయని వారు వెల్లడించారు. తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!