E20 Petrol: E20 పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందా..? సర్వేలో షాకింగ్ నిజాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Petrol: దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్ వాహన యజమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం దీనిని గ్రీన్ ఎనర్జీ వైపు చారిత్రాత్మక అడుగుగా అభివర్ణిస్తుండగా.. సాధారణ ప్రజలు మాత్రం దీన్ని తిరస్కరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ప్రకారం.. ఈ కొత్త మిశ్రమ ఇంధనం వాహన మైలేజీని తగ్గించి ఖర్చులను పెంచిందని చెబుతున్నారు.
READ MORE: Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
సర్వే ఏం చెబుతోంది?
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. 2022లో లేదా అంతకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు చెందిన పది మంది యజమానులలో ఎనిమిది మంది ఈ పెట్రోల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2025 నాటికి తమ వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గిందని నివేదించారు. దేశవ్యాప్తంగా 323 జిల్లాల నుంచి 36,000 మంది వాహన యజమానులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 69% మంది పురుషులు, 31% మంది మహిళలు. ఇందులో దాదాపు సగం మంది టైర్-1 నగరాలకు చెందినవారు. మిగిలిన వారు టైర్-2, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
2025 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి మైలేజ్, వాహనం పనితీరుకు సంబంధించిన ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఈ సమస్య ముఖ్యంగా 2023 కి ముందు కొనుగోలు చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలలో మొదలైంది. ప్రభుత్వం ఈ ఇంధనం అన్ని వాహనాలకు సురక్షితమైనదని నిరంతరం ప్రకటిస్తున్నప్పటికీ.. E20 పెట్రోల్ను ఉపయోగించిన తర్వాత తమ వాహనాల మైలేజీ తగ్గిందని వాహన యజమానులు నివేదిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు తమ కార్లు ఉదయం స్టార్ట్ కావడం లేదని, మరికొందరు ఇంజిన్ పాడై మరమ్మతుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. చెన్నైలోని ఒక లగ్జరీ కారు యజమాని E20 కారణంగా తన కారు ఇంజిన్ విఫలమైందని, దీని మరమ్మతుల కోసం దాదాపు ₹4 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి అనేక నగరాల్లోని మెకానిక్లు ఇంధన సంబంధిత ఫిర్యాదులు దాదాపు 40% పెరిగాయని చెబుతున్నారు.
READ MORE: ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
అయితే.. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి (బ్లెండెడ్ పెట్రోల్) వాహనాల్లో వినియోగించడంతో ఇంధన సామర్థ్యం 2-5 శాతం మేర తగ్గిపోవచ్చని వాహన పరిశ్రమ నిపుణులు గతంలో అంచనా వేశారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొద్దిగా తేడాలు ఉండొచ్చని భావించారు. ఇ20 ఇంధనం వాడకంతో వాహనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తుండగా, వాహన రంగంలోని ప్రధాన కంపెనీల్లో పని చేస్తున్న ఇంజినీర్లు కొంత మంది స్పందించారు. ఇ20 రకానికి చెందని పాత వాహనాల్లో ఈ పెట్రోల్ వాడకంతో దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులు కోతకు గురవుతాయని వారు వెల్లడించారు. తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..