Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Hyderabad Mother Kills Twins Then Dies By Suicide Family Dispute

Hyderabad Tragedy: వాళ్లేం తప్పు చేశారు..? కన్న బిడ్డలను చంపేస్తున్న తల్లిదండ్రులు..!

Published Date :October 14, 2025 , 8:58 pm
By RAMAKRISHNA KENCHE
Hyderabad Tragedy: వాళ్లేం తప్పు చేశారు..? కన్న బిడ్డలను చంపేస్తున్న తల్లిదండ్రులు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad Tragedy: మా ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు.. నిజానికి పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు. అలాంటిది. కన్నబిడ్డల గొంతు నులిమి, వారికి విషం పెట్టి చంపేసేంత కర్కశత్వంగా మారుతున్నారు కొంత మంది పేరెంట్స్. తాజాగా హైదరాబాద్ బాలానగర్‌ పరిధిలోని పద్మానగర్‌లో ఇలాంటి విషాదమే జరిగింది. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. తన ఇద్దరు కవల పిల్లలను గొంతు నులిమి చంపి… తాను కూడా బిల్డింగ్‌ పై నుంచి చనిపోయింది..

READ MORE: Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. శిల్పకళావేదికలో నియామక పత్రాల కార్యక్రమం

Also Read

  • Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం

ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన అనిల్‌ కుమార్‌, సాయి లక్ష్మికి నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. అనిల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో.. హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. పెళ్లి తర్వాత సాయిలక్ష్మితో కలిసి బాలానగర్‌లోని పద్మానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగారు. రెండేళ్ల క్రితం వీళ్లకు కవల పిల్లలు పుట్టారు. ఓ బాబు, ఓ పాప. అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్ల కాపురంలో కలహాలు మొదలయ్యాయి. బాబుకు రెండేళ్ల వయసు వచ్చినా.. మాటలు రాకపోవడంతో స్పీచ్‌ థెరపీలో జాయిన్‌ చేశారు. పాప కూడా తరుచూ అనారోగ్యానికి గురవుతోంది. దీంతో… భార్యాభర్తల మధ్య గొడవలు షురూ అయ్యాయి. రోగిష్టి పిల్లలను కన్నావ్‌ అంటూ.. సాయిలక్ష్మిని నిత్యం దూషించేవాడు అనిల్‌. కన్న తండ్రి అయి ఉండి కూడా పిల్లలను కసురుకునేవాడు. సోమవారం ఉదయం ఉద్యోగానికి వెళ్లిన అనిల్‌.. సాయంత్రం ఇంటికి రాలేదు. తన అన్న ఇంటికి వెళ్లాడు. అన్న వదినతో కలిసి.. వైజాగ్‌లో ఓ ఫంక్షన్‌‌కు అటెండ్‌ అయ్యేందుకు ప్లాన్‌ చేశాడు. మరోవైపు పిల్లల పరిస్థితి.. రోజూ భర్త వేధింపుల కారణంగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయిలక్ష్మి తీవ్రంగా మానసిక వేదనకు గురైంది. ఏ కన్న తల్లి చేయని విధంగా ఘాతుకానికి పాల్పడింది. ఇద్దరు పిల్లల ముఖాలపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసింది. గొంతు నులిమి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత బిల్డింగ్‌ మీదకు ఎక్కి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన అపార్ట్‌మెంట్‌ ఓనర్‌.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే ఏరియాలో ఉండే సాయిలక్ష్మి తండ్రికి, భర్త అనిల్‌‌కి కాల్‌ చేశాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు… ఇద్దరు పిల్లలు, సాయిలక్ష్మి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు..

READ MORE: Premanand Maharaj: ప్రేమానంద్ మహారాజ్ కోలుకోవాలని మదీనాలో ప్రార్థించిన ముస్లిం వ్యక్తి.. (వీడియో)

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. హైదరాబాద్ హబ్సిగూడలో తమ ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు చంద్రశే ఖర్ రెడ్డి దంపతులు. ప్రైవేటు కాలేజ్ మాజీ లెక్చరర్ చంద్రశే ఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తనతోపాటే ప్రాణాలు తీసుకోవాలని భార్యకూ చెప్పి ఒప్పించాడు. తాము చనిపోతే పిల్లలేమైపో తారోనన్న ఆందోళనతో.. వారిద్దరూ ఉరి వేసుకోవ డానికి ముందు. తమ 15 ఏళ్ల కుమార్తెను, పదేళ్ల కుమారుణ్ని కర్కశంగా చంపేశారు. మొన్నటికి మొన్న విజయవాడలో శ్రీనివాస్ అనే వైద్యుడు అప్పుల బాధ తట్టుకోలేక తల్లి, భార్యతో సహా తమ ఇద్దరు పిల్లల్ని పొట్టన పెట్టుకొని, ఆపై తాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.. కడప జిల్లాకు చెందిన నాగేంద్ర తాను ఉరివేసుకుని చనిపోవడానికి ముందు భార్యా, పిల్లలను చంపేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకటేశ్.. కన్నబిడ్డలన్న కనికరమైనా లేకుండా.. ఐదేళ్లలోపు బాబు, పాప ముఖంపై దిండు పెట్టి అదిమి, ఆపై భార్యను కడతేర్చి తాను కూడా తనువు చాలించాడు.. నిన్నటికి నిన్న కడపలో భార్య, కొడుకుతో కలిసి గూడ్స్ ట్రెయిన్ కింద పడి బలవన్మరణం చెందాడు శ్రీరాములు. రోజూ మద్యం తాగి గొడవ చేస్తున్నాడనే కారణంకో నానమ్మ సుబ్బమ్మ.. శ్రీరాములును మందలించింది. అంతే ఇంట్లో నుంచి భార్య శిరీష, కొడుకు రిత్విక్‌ను తీసుకుని వెళ్లిపోయి గూడ్స్ ట్రెయిన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు నానమ్మ కూడా గుండెపోటుతో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనలోనూ అభం శుభం తెలియని చిన్నారి రిత్విక్‌ను పేరెంట్స్ తమ గొడవలకు బలి చేశారు.. ఇలా.. ఇటీవలికాలంలో జరిగిన వరుస ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఆర్థిక సమస్యలు, ట్రేడింగ్, బెట్టింగ్ లాంటి వ్యసనాలు, కుటుంబ కలహాలు వంటివి వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా పైకి కనిపించినా.. బలవంతంగా ఉసురు తీసుకునే స్వభావం వెనుక మానసిక రుగ్మతలే కారణం అంటున్నారు వైద్యులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • child murder
  • depression
  • Family Disputes
  • HYDERABAD News
  • Hyderabad tragedy

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions