Deputy CM Bhatti Vikramarka: ప్రపంచంలో పోటీపడే విధంగా మన బిడ్డలు ఎదగటం కోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి స్కూలుకి 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఎకరాల ప్లాన్లో అత్యంత అద్భుతంగా స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. దేశంలోనే ఇటువంటి స్కూల్స్ ఏ రాష్ట్రంలో కూడా నిర్మించడం లేదన్నారు. క్వాలిటీకి ఎక్కడ కొరతలేదని…
India-Paksitan War: చైనా వక్ర బుద్ధి మరోసారి బట్టబయలైంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్-పాకిస్థాన్ ఘర్షణను చైనా కొత్త సైనిక హార్డ్వేర్ను పరీక్షించడానికి ఉపయోగించుకుంది. ఈ సమాచారాన్ని యూఎస్ కాంగ్రెస్ ప్యానెల్ తాజా నివేదిక బట్టబయలు చేసింది. ఇరు దేశా మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణను బీజింగ్ ప్రత్యక్ష పరీక్షా కేంద్రంగా ఉపయోగించుకుందని నివేదిక వెల్లడించింది. కొత్తగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థల పరిధి, మెరుగుదలను పరీక్షించడానికి చైనా ఉపయోగించుకుందని…
Election Commission: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లా వారీ అబ్జర్వర్లతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. వచ్చే వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు, భద్రతా చర్యలు, పోలింగ్ ఏర్పాట్లపై ఈ సమావేశంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈసీ చర్యలు అధికార యంత్రాంగాన్ని ఉత్సాహపరుస్తున్నాయి.
Coffee Topped With Powdered Cockroach: చైనా వంటకాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీటకాలు, పురుగులు, పాములు, పక్షులు, జంతువులు ఇలా వేటినీ వదలకుండా మింగేస్తుంటారు. అయితే.. తాజాగా చైనా రాజధాని నుంచి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. బీజింగ్లోని ఒక కీటకాల నేపథ్య మ్యూజియం కాఫీని గమ్మత్తుగా తయారు చేసింది. కాఫీలో బొద్దింక పొడి, ఎండిన పురుగుల లార్వాల మిశ్రమం కలిపి అక్కడి జనాలకు నచ్చేలా అద్భుతంగా తయారు చేశారు. ఈ అసాధారణ చైనీస్ కాఫీని భారతీయులు మాత్రం తాగలేరు.
Commander Namansh Syal: దుబాయ్లో జరిగిన వైమానిక ప్రదర్శన సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మరణించాడు. ఈ సంఘటనపై భారత వైమానిక దళం విచారం వ్యక్తం చేసింది.. అమరుడైన వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ (34) గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని నగ్రోటా బాగ్వాన్ ప్రాంతం పాటియాలాకాడ్ గ్రామానికి చెందిన వ్యక్తి. శుక్రవారం మధ్యాహ్నం వింగ్ కమాండర్ నమాంశ్ స్యాల్ అమరులయ్యారనే వార్తతో గ్రామం…
Begumpet: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళా అసిస్టెంట్ పైలట్పై మరో పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై రెండు రోజుల క్రితం బాధితురాలు బేగంపేట్ పోలీసులు ఆశ్రయించింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 20న బిజినెస్ ఫ్లైట్లో బేగంపేట నుంచి పుట్టపర్తి చెన్నై మీదుగా బెంగళూరు వెళ్ళింది బాధితురాలు.. సాయంత్రం 4.20 నిమిషాలకు బిజినెస్ ఫ్లైట్ బెంగళూరు చేరుకుంది. అనంతరం బెంగళూరులోని హోటల్లో మహిళా అసిస్టెంట్ పైలెట్తో […]
Maoists: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్న మరోసారి పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు.
Hot Shower After Gym: ఇటీవల, 24 ఏళ్ల వ్యక్తి జిమ్ తర్వాత వేడి స్నానం చేస్తూ స్పృహ కోల్పోయాడని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి జిమ్ తర్వాత మనం స్నానం చేయడం సర్వసాధారణం. కానీ.. వ్యాయామం అనంతరం వెంటనే వేడి నీటి జల్లులు శరీరంపై పడటం కొంతమందికి ప్రమాదకరం. ఈ అంశంపై హెచ్చరిస్తూ ఓ అమెరికన్ వైద్యుడు కీలక సూచనలు చేశారు. అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ కునాల్ సూద్ సోషల్ మీడియాలో ఓ…
UP: ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. వివాహం జరిగిన ఏడు రోజులకే. వరుడిని తన ప్రేమికుడితో కలిసి నవ వధువు హత్య చేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం.. పరశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేదిపూర్ గ్రామంలో అనిస్ అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. అయోధ్య జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది.
New Labour Codes: మోడీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలపై అతిపెద్ద అడుగు వేసింది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త కార్మిక కోడ్లను ప్రవేశపెట్టింది. నవంబర్ 21 నుంచి ఈ కొత్త కోడ్లు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పు దేశ ఉపాధి, పారిశ్రామిక వ్యవస్థను పునర్నిర్వచించగలదు. ఇది 400 మిలియన్ల మంది కార్మికులకు సామాజిక భద్రతా కవరేజీని అందిస్తుంది. అంటే దేశంలోని సగానికి పైగా శ్రామిక శక్తిని మొదటిసారిగా రక్షణ గొడుగు కిందకు తీసుకువచ్చారు. దేశంలో అమలు చేయబడుతున్న…