Pakistan-Afghanistan: పాక్-ఆఫ్ఘన్ మధ్య కొత్త టెన్షన్.. తాలిబాన్ స్థావరంపై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Afghanistan: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఇరు దేశాల మధ్య కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఆప్ఘనిస్థాన్లోని కాందహార్ ప్రాంతంలో తాలిబన్ సంబంధిత స్థావరంపై పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. ఇటీవలి డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు పాకిస్థాన్ పేర్కొంది. గత కొన్ని రోజులుగా పాకిస్థాన్లోని వివిధ నగరాలపై అనేక డ్రోన్లు కనిపించాయని పాకిస్థాన్ సైన్యం చెబుతోంది. చాలా డ్రోన్లను సకాలంలో అడ్డగించామని, అవి తమ లక్ష్యాలను చేరుకోకుండా నిరోధించాయని పాకిస్థాన్ సైన్యం పేర్కొంది. అయితే.. విచ్ఛిన్నమయ్యాక భూమి మీద పడిపోతున్న డ్రోన్ శిథిలాలు కొన్ని ప్రాంతాలలో నష్టాన్ని కలిగించాయని వెల్లడించింది. క్వెట్టాలో శిథిలాల వల్ల ఇద్దరు పిల్లలు గాయపడగా, కోహత్, రావల్పిండిలలోనూ అనేక మంది గాయపడ్డారని తెలిపింది.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. టీటీడీ చరిత్రలోనే అరుదైన రికార్డు!
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన పాకిస్థాన్ ఈ దాడులు జరిపినట్లు చెబుతున్నారు. దేశంలోని పౌరులను, భద్రతా స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్థాన్ సైన్యం తీవ్రంగా మండిపడింది. డ్రోన్ దాడులు ఆప్ఘనిస్థాన్ కాందహార్లోని సైనిక స్థావరానికి సంబంధించినవని పాకిస్థాన్ ఆరోపించింది. తత్ఫలితంగా, పాకిస్థాన్ ఆ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి ప్రారంభించింది. తాజా నివేదికల ప్రకారం.. డ్రోన్ కార్యకలాపాలను గుర్తించిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్ చుట్టూ ఉన్న వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సంఘటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. పాకిస్థాన్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సమా టీవీ (Samaa TV) ప్రకారం.. తాలిబాన్ అనుబంధ యోధులు ఉపయోగించే కాందహార్లోని సాంకేతిక సౌకర్యాలు, ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఆపరేషన్ జరిగింది. కాందహార్లో జరిపిన దాడులపై కాబూల్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.
తాజావార్తలు
-
Airtel: రూ.99కే ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియం.. 20కి పైగా OTT యాప్లకు యాక్సెస్
-
Venkatesh Iyer: ట్రోలింగ్ నన్ను ప్రభావితం చేసింది.. ఆ మ్యాచ్ నా కెరీర్లో కీలక మలుపు!
-
Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
-
PM Svanidhi: 55 లక్షల మందికి గుడ్ న్యూస్.. పీఎం స్వనిధి పథకంలో మరిన్ని ప్రయోజనాలు..పూర్తి వివరాలు ఇవే!
-
Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!