Bhatti Vikramarka: ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లు.. ప్రతి పాఠశాలకి రూ. 200 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Bhatti Vikramarka: ప్రపంచంలో పోటీపడే విధంగా మన బిడ్డలు ఎదగటం కోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి స్కూలుకి 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఎకరాల ప్లాన్లో అత్యంత అద్భుతంగా స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. దేశంలోనే ఇటువంటి స్కూల్స్ ఏ రాష్ట్రంలో కూడా నిర్మించడం లేదన్నారు. క్వాలిటీకి ఎక్కడ కొరతలేదని చెప్పారు.. గత 15లో రెసిడెన్షియల్ స్కూల్ అని బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది.. పోషకాహారం లేని భోజనాన్ని అందించింది.. ఆనాడు అరకొరగా పనికిరాని చీరలు గత ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. కట్టు
కోవడానికి పనికి వచ్చేటువంటి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.
READ MORE: Mollywood Heroines : పెన్షన్ తీసుకునే వయసొస్తున్నపెళ్ళికి నో చెప్తున్న కేరళ కుట్టీలు..
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
పదేళ్లపాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ వడ్డీ లేనిరుణాలను ఇవ్వకుండా మహిళలకు అన్యాయం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. “ఏడాదికి 20,000 కోట్ల రూపాయలను మహిళలకి వడ్డీ లేని రుణాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది.. 20వేల కోట్ల రూపాయలు ఇవ్వటం సాధ్యమా? అని చాలామంది నవ్వారు.. కానీ మేము ఇచ్చి చూపిస్తున్నాం.. 27 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించింది.. ప్రజలందరి సమక్షంలో ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను అందిస్తాం.. ఇది మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న సంకల్పం.. మహిళలకు పెట్రోల్ బంకులు అందిస్తున్నాం.. రెండు మెగావాట్లకు తగ్గకుండా సోలార్ పవర్లు మహిళలకి అందించనున్నాం. 93 లక్షల కుటుంబాలు సన్న బియ్యం పొందుతున్నారు. ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడం లేదు.. రూ.13,500 కోట్లు వెచ్చి సన్న బియ్యం అందిస్తున్నాం.. 53 లక్షల కుటుంబాలు ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం.. ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించి రికార్డు స్థాయిలో పథకం ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నాం..” అన్నారు. వైరాతో తనకు విడదీయ రాని అనుబంధం ఉందని భట్టి తెలిపారు. వైరా నుంచే రాజకీయ జీవితం ప్రారంభించానన్నారు. ఉప ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడుతున్నాం.. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వైరా నియోజకవర్గంలో శరవేగంగా సాగుతోందన్నారు. వైరా ప్రజల కోసం జైలుకు, కోర్టుకు వెళ్ళాని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
-
Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
-
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
-
Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
-
Padma Awards 2026: ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. అవార్డు స్వీకరించిన హేమా మాలిని, కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె అహానా
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?