WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది. […]
SLBC Tragedy: తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కొన్నిరోజుల క్రితం ఈ టన్నెల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది లోపల చిక్కుకుపోయారు. ఈ సంఘటన జరిగి ఎనిమిదో రోజుకు చేరుకుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తవ్వలేదు. పనులు పూర్తి చేసేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం మట్టి తొలగింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. అధికారులు కార్మికుల ఆనవాళ్లను […]
Job Application Reject: ఉద్యోగ అన్వేషణలో కొన్ని అప్లికేషన్ల సమీక్షకు వారాలు పట్టవచ్చు. మరికొన్ని కొద్ది రోజులకే సమాధానం రావొచ్చు. అయితే, ఓ అభ్యర్థి ఉద్యోగానికి అప్లై చేసిన కేవలం ఒక నిమిషం లోపే రిజెక్ట్ అయినట్లు తెలియడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్లో ఈ విషయాన్ని పంచుకున్న అతను, “ఒక నిమిషంలో ఎంతో మారిపోవచ్చు. నేను నా అర్హత, అనుభవం, లొకేషన్, అమెరికాలో పని చేయడం ఇలా అన్నింటినీ క్రాస్ చెక్ చేసుకున్నాను. […]
Mumbai: మహారాష్ట్రలోని అలిబాగ్ సముద్ర తీరానికి సమీపంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ భయానక పరిస్థితి ఏర్పడింది. ఈ బోటులో 18 నుండి 20 మంది మత్స్యకారులు ఉన్నారని సమాచారం. అయితే, అందులోని మత్స్యకారులందరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. నేడు ఉదయం అలిబాగ్ సమీప సముద్రంలో ఓ మత్స్యకారుల బోటుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. […]
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. గత 12 గంటలుగా కుండపోత వర్షాలు, భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు లాహౌల్ స్పీతి, చంబా-పాంగీ, కిన్నౌర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ మంచు కారణంగా రహదారులు మూసివేయబడ్డాయి. దీంతో ఈ ప్రాంతాలు మిగతా ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోయాయి. గత 24 గంటల్లో లాహౌల్ స్పీతి, కిన్నౌర్, చంబా, కాంగ్రా, […]
Wife Harassment: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో […]
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,51,162 కోట్లు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా […]
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ను రూపొందించింది. ఈ బడ్జెట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల అసెంబ్లీలో, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]
Realme P3x: రియల్మి ఇటీవల భారత మార్కెట్లో తన కొత్త P3 సిరీస్ను లాంచ్ చేసింది. ఈ సిరీస్లో రియల్మి P3 ప్రో 5G, రియల్మి P3x 5G మోడల్స్ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రో మోడల్ సేల్కు సిద్ధంగా ఉండగా.. తాజాగా రియల్మి P3x 5G సేల్ మొదలు పెట్టింది. వినియోగదారులు ఈ స్మార్ట్ఫోన్ను రియల్మి ఇండియా వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6000mAhబ్యాటరీ, శక్తివంతమైన MediaTek Dimensity 6400 చిప్సెట్, 50MP కెమెరా […]
Samsung Galaxy M06: శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు మోడల్స్ ను లాంచ్ చేసిన శాంసంగ్ తాజాగా మరో రెండు ఎంట్రీ లెవల్ 5G ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో గెలాక్సీ M06 5G మోడల్ అత్యంత తక్కువ ధరలో లభించగా, గెలాక్సీ M16 5G మోడల్ మరింత మెరుగైన స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. Read Also: Caste […]